
మావుళ్లమ్మను దర్శించుకున్న డీఐజీ
భీమవరం(ప్రకాశం చౌక్): శ్రీమావుళ్లమ్మను సోమవారం గుంటూరు రేంజ్(జైలు శాఖ) డీఐజీ ఎం.వర ప్రసాద్ దర్శించుకున్నారు. ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీ నగేష్ అమ్మవారి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్లో టెలిఫోన్ బకాయిల పరిష్కారం
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని బీఎస్ఎన్ఎల్ టెలిఫోను బిల్లులు బకాయిపడ్డ వినియోగదారులు ఈ నెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి.రాజు ఒక ప్రకటనలో సూచించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, తణుకు, భీమవరం, నరసాపురం పరిధిలోని లోక్ ఆదాలత్ కోర్టుల్లో పరిష్కరించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల 94947 08898, 94903 12777, 94404 33533 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ధాన్యం కొనుగోళ్ల పరిశీలన
పెనుమంట్ర: మందకొడిగా ధాన్యం కొనుగోళ్లపై సాక్షిలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు. మండల వ్యవసాయ అధికారి ఎ.జ్యోశ్యుల, తహసీల్దార్ వై.రవికుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. మండలంలో వారం రోజులుగా 4380 ఎకరాలలో కోతలు జరిగగా, 9198 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 7,098 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగొలు చేశామని చెప్పారు. సాక్షిలో ప్రచురితమైన వార్తపై వెలగలవారిపాలెంలో రైతులను విచారించామన్నారు. ధాన్యం తేమ శాతం 16.8గా గుర్తించి 1,100 సంచులను రైతులకు అందజేశారని, ధాన్యం రోడ్డుపైకి చేర్చడానికి కాలువగట్టు సరిగ్గా లేనందున దారిని బాగుచేసుకుని మిల్లులకు పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు రైతులు తెలిపారని చెప్పారు.

మావుళ్లమ్మను దర్శించుకున్న డీఐజీ