
● సామాజిక స్పృహ పెంచేలా..
తోలేరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి నాటక పోటీలు సోమవారం వీరవాసరంలో ప్రారంభమయ్యాయి. సామాజిక స్పృహను పెంపొందించడానికి నాటక రంగం ఎంతో దోహదపడుతుందని వక్తలు పేర్కొన్నారు. మొదటి ప్రదర్శనగా స్వప్నం రాల్చిన అమృతం నాటిక, రెండో ప్రదర్శనగా కిడ్నాప్ నాటిక అలరించాయి. సినీ నటుడు శుభలేఖ సుధాకర్, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణను సత్కరించారు. కళాపరిషత్ అధ్యక్షుడు చవ్వాకుల సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. –వీరవాసరం