ఆల్‌ ద బెస్ట్‌.. జ్యోతికశ్రీ | - | Sakshi
Sakshi News home page

ఆల్‌ ద బెస్ట్‌.. జ్యోతికశ్రీ

Aug 9 2024 12:50 AM | Updated on Aug 9 2024 12:50 AM

ఆల్‌

ఆల్‌ ద బెస్ట్‌.. జ్యోతికశ్రీ

ఒలింపిక్స్‌ 400 మీటర్ల రిలే పరుగులో నేడు తణుకు క్రీడాకారిణి ప్రదర్శన

తణుకు అర్బన్‌: పారిస్‌ ఒలింపిక్స్‌లో తణుకుకు చెందిన పరుగుల రాణి దండి జ్యోతికశ్రీ శుక్రవారం పాల్గొనే 400 మీటర్ల రిలే పరుగు పోటీల్లో ప్రదర్శనపై పట్టణవాసులతో పాటు జిల్లా వాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం 2.22 గంటలకు జరిగే ఈ పోటీల్లో దండి జ్యోతికశ్రీ మెరుగైన ప్రదర్శన ఇచ్చి భారతదేశానికి బంగారుపతకం సాధించాలంటూ ఆమెను ప్రోత్సహిస్తూ పట్టణంలోని పలు సెంటర్లలో గురువారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో జ్యోతికశ్రీ పేరు మారుమోగుతోంది. ఈ సందర్భంగా జ్యోతికశ్రీకి అభిమానులు ఆల్‌ ద బెస్ట్‌ చెబుతున్నారు.

సిమెంట్‌ డీలర్‌షిప్‌ ఇప్పిస్తానని

మోసంపై కేసు నమోదు

ద్వారకాతిరుమల: ఓ సిమెంట్‌ కంపెనీ డీలర్‌షిప్‌ ఇప్పిస్తానని మోసం చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్సై జి.సతీష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఓ సిమెంట్‌ కంపెనీకి జిల్లా సేల్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఉండేల కిరణ్‌కుమార్‌ రెడ్డి 2023 డిసెంబర్‌లో ద్వారకాతిరుమలకు చెందిన పొనమాల నాగరాజేష్‌, తిమ్మాపురానికి చెందిన షేక్‌ బాషాల వద్దకు వెళ్లి సిమెంట్‌ కంపెనీ డీలర్‌షిప్‌ ఇప్పిస్తానని నమ్మించాడు. దీనికి సమయం పడుతుందని, అప్పటివరకు కంపెనీ నుంచి సిమెంట్‌ ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో అతనిని నమ్మిన నాగరాజేష్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ.2.08 లక్షలు, షేక్‌ బాషా బ్యాంకు ఖాతా నుంచి రూ.1.56 లక్షలు, వెరసి మొత్తం రూ.3.64 లక్షలను కిరణ్‌కుమార్‌రెడ్డి బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నాడు. నెలలు గడుస్తున్నా సిమెంట్‌ సరఫరా కాకపోవడంతో మోసపోయినట్టు గుర్తించిన బాధితులు స్థానిక పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

ఆల్‌ ద బెస్ట్‌.. జ్యోతికశ్రీ 
1
1/1

ఆల్‌ ద బెస్ట్‌.. జ్యోతికశ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement