
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మేమంతా సిద్ధం యాత్రకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సన్నద్ధమైంది. కృష్ణా జిల్లా నుంచి పశ్చిమగోదావరిలోకి యాత్ర ప్రవే శించి ఏలూరు జిల్లా మీదుగా తూర్పుగోదావరి జి ల్లాలోకి వెళ్లనుంది. ఉమ్మడి జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర, భీమవరంలో బహిరంగ సభకు సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 15న (సోమవారం) భీమవరంలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర ప్రవేశించనుంది.
ఘన స్వాగతానికి భారీ ఏర్పాట్లు
ఎన్నికల ప్రచారం తారాస్థాయి చేరిన తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పశ్చిమలోకి ప్రవేశించనుంది. భీమవరంలో ముఖ్యమంత్రి బస్సు యాత్రకు అపూర్వ స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లా పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, పార్టీ ముఖ్యులతో భీమవరంలో సమావేశం నిర్వహించారు. ఈనెల 15న లోసరి మీదుగా భీమవరం నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి బర్రివానిపేట, తోకతిప్ప, గూట్లపాడురేవు, గొల్లవానితిప్ప మీదుగా భీమవరం శివారుకు చేరుకుంటుంది. భీమవరం రూరల్ పోలీస్స్టేషన్ సెంటర్ నుంచి రోడ్షో ప్రా రంభమై అంబేడ్కర్ సెంటర్, డీ–మార్ట్ మీదుగా బైపాస్ రోడ్డు చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి ఉండి నియోజకవర్గంలోని ఉండి, ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం, నారాయణపురం మీదుగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లకు యాత్ర చేరుకోనుంది. ఈ క్రమంలో మూడు నియోజకవర్గాల్లో అపూర్వ స్వాగతాలు పలకడానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భీమవరంలో జరిగే మేమంతా సిద్ధం సభకు పశ్చిమగోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి పార్టీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థితో పాటు అన్ని నియోజకవర్గాల నుంచి భారీ ర్యాలీని నిర్వ హించనున్నారు. ఎన్నికల శంఖారావం పూరించాక మొదటిసారి జిల్లాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానుండటం, పూర్తిస్థాయిలో పర్యటన ఉండటంతో వైఎస్సార్సీపీ శ్రేణులు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
15న భీమవరంలో సీఎం జగన్ బస్సు యాత్ర
భీమవరం, ఉండి, ఉంగుటూరు మీదుగా పర్యటన
భీమవరంలో బహిరంగ సభకు చురుగ్గా ఏర్పాట్లు
పార్టీ అభ్యర్థులతో రీజనల్ కో–ఆర్డినేటర్ మిథున్రెడ్డి సమావేశం