
భీమవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని టీబీ సెంటర్
●
ఇళ్లకు వెళ్లి మందులిస్తాం
క్షయ వ్యాధి హెచ్ఐవీ, పొగ తాగేవారికి, షుగర్ వ్యాధి, రక్తహీనత, మద్యపానం ఇతర చెడు అలవాట్లు ఉన్నవారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ. సీబీ న్యాట్ వైద్య పరికరం ద్వారా, ఎక్స్రే ద్వారా క్షయ వ్యాధి నిర్ధారణ చేస్తాం. ప్రభుత్వం ఖరీదైన మందులను 6 నెలల నుంచి 18 నెలలు వరకు అందిస్తుంది. ఆరోగ్య కార్యకర్తలే బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి మందులు వాడిస్తారు. పౌష్టికాహరం తీసుకోవడంపై అవగాహన కల్పిస్తారు. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, మందులు వాడటం ద్వారా వ్యాధి సులువుగా నయం చేసుకోవచ్చు.
– డాక్టర్ భానునాయక్, జిల్లా క్షయ నివారణ అధికారి, భీమవరం
భీమవరం (ప్రకాశం చౌక్): క్షయ (టీబీ) వ్యాధిని పూర్తిగా సమాజం నుంచి దూరం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో బాధ్యతగా వ్యహరించి వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు, పౌష్టికాహారం తీసుకోవడానికి ఆర్థికం సాయం అందిస్తున్నాయి. ఈ వ్యాధిపై అవగాహన పెంచుకుని, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా బాధితులు వ్యాధిని జయిస్తున్నారు. ఈ వ్యాధి సోకినవారికి ఎండీఆర్ (మల్టీ డ్రగ్ రెసిడెన్సియల్) చికిత్సను ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది.
లక్షణాలు ఇవే
● రెండు వారాలకు మించి దగ్గు ఉండటం, దగ్గినప్పుడు రక్తం పడడం
● ఛాతిలో నొప్పి, బరువు తగ్గడం, ఆకలి మందగించడం,
● రాత్రి వేళల్లో తరచూ జ్వరం వస్తుంటే టీబీ లక్షణాలుగా గుర్తించాలి.
వ్యాధి నిర్ధారణ
కళ్లె పరీక్ష, ఎక్స్రే, ఆర్టీపీసీఆర్, సీబీ న్యాట్ పరీక్షల ద్వారా టీబీ వ్యాధిని నిర్ధారణ చేస్తారు. హెచ్ఐవీ ఉన్నవారు, పొగ తాగేవారు, మధ్యపానం, రక్తహీనత, సుగర్ వ్యాధి, ఇతర చెడు అలవాట్లు ఉన్నవారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ. అలాగే వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా నోటి తుంపరులు ఇతరులపై పడడం వల్ల కూడా ఈ వ్యాధి సోకుతుంది.
ఉచిత పరీక్షలు
ఏరియా, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా టీబీ సెంటర్లను నిర్వహిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో 14 (ఆర్టీపీసీఆర్ సెంటర్లు) టీబీ నిర్ణారణ, చికిత్స అందించే సెంటర్లు ఉన్నాయి. తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, పెనుగొండ, నరసాపురం, ఆచంట, ఆకివీడు, లంకలకోడేరు, గణపవరం, భీమవరం, కాళ్ల, అత్తిలి, మంచిలి, ఉండి తదితర సెంటర్లల్లో టీబీ నిర్ధారణకు ఉచిత పరీక్షలు, వ్యాధిగ్రస్తులకు మందులు ఉచితంగా అందిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ చేసేందుకు వినియోగిస్తున్న సీబీ న్యాట్ పరీక్ష పరికరాలు తాడేపల్లిగూడెం, భీమవరం ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి.
మందులు, ఆర్థిక సాయం
టీబీ వ్యాధి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఉపరితిత్తులకు సోకేది. రెండోది ఇతర భాగాలకు సోకేది. టీబీ సోకిన బాధితులకు మందులు 9 నెలల నుంచి 18 నెలల వరకు కోర్సు ఉంటుంది. ప్రభుత్వం నెలా నెలా బాధితులకు మందులను ఉచితంగా అందిస్తోంది. అలాగే వ్యాధిగ్రస్తులు పోషకాహారం తీసుకోవడానికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.500 ఆర్థిక సాయాన్ని చికిత్స పూర్తయ్యే వరకు అందిస్తోంది. జిల్లాలో గడిచిన ఐదేళ్లలో 15,287 మంది ఈ వ్యాధి బారిన పడగా, వీరిలో 15,263 మంది పూర్తిగా కోలుకున్నారు. అలాగే జిల్లాలోని పరిశ్రమల యజమానులు, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించేందుకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి.
దేశంలో దీర్ఘకాలిక రోగాలలో ప్రధానమైనది క్షయ. ఇది అంటు వ్యాధి. మైకోబాక్టీరియా లేదా మైకోబ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఊపిరితిత్తులకు సంబంధించినది అయినా చర్మం నుంచి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికై నా వ్యాధి వ్యాపిస్తుంది. జిల్లాలో గడిచిన ఐదేళ్లలో 15,287 మంది ఈ వ్యాధి బారిన పడగా, రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల వీరిలో 15,263 మంది పూర్తిగా కోలుకోవడం విశేషం. ఆరోగ్య కార్యకర్తలు రోగుల ఇళ్లకు వెళ్లి వారితో మందులను వేయడం, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి నయమవుతోంది. ఆదివారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా కథనం..
జిల్లాలో టీబీ పరీక్షలు, బాధితుల వివరాలు
సంవత్సరం చేసిన నిర్ధారణ కోలుకున్న
పరీక్షలు అయిన వారి
కేసులు సంఖ్య
2019 34,910 3232 3228
2020 22,794 2129 2125
2021 32,494 3243 3240
2022 30,993 3358 3350
2023 39,803 3325 3320
9 నెలల కోర్సు మందులతో వ్యాధి నయం
ఉచితంగా మందులు, పోషకాహారం పంపిణీ
2025 నాటికి వ్యాధి రహిత సమాజమే లక్ష్యం
సత్ఫలితాలనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలు
సకాలంలో చికిత్సతో కోలుకుంటున్న రోగులు
నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం

వ్యాధిగ్రస్తులకు ఉచితంగా అందించే మందులు
