
వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న కలెక్టర్
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఫామ్–6,7,8 క్లెయిమ్లను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్కుమార్ మీనాకు కలెక్టర్ పి.ప్రశాంతి వివరించారు. విజయవాడ నుంచి శుక్రవారం ఈఆర్ఓ.నెట్, ఈవీఎం గోడౌన్లు, ఎపిక్ కార్డుల పంపిణీ, ఈపీ కేసులు, ఎస్ఓపీలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ పి.ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్.రామసుందర్రెడ్డి, డీఆర్వో కె.కృష్ణవేణి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ఫామ్–6 క్లెయిమ్లకు సంబంధించి 5,800 దరఖాస్తులు రాగా 862 పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఫామ్–7 క్లెయిమ్లకు సంబంధించి 2,549 దరఖాస్తులు రాగా 241 పెండింగ్ ఉన్నాయని, ఫామ్–8 క్లెయిమ్లకు సంబంధించి 1,895 దరఖాస్తులు రాగా, 354 పెండింగ్లో ఉన్నాయన్నారు. వీటన్నింటినీ వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. నరసాపురం సబ్ కలెక్టర్ ఎం.సూర్యతేజ, భీమవరం ఆర్టీఓ దాసి రాజు, ఆర్ఓలు, ఈఆర్ఓలు పాల్గొన్నారు.