యువకుడి అదృశ్యంపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

యువకుడి అదృశ్యంపై కేసు నమోదు

Jun 4 2025 1:23 AM | Updated on Jun 4 2025 1:23 AM

యువకుడి అదృశ్యంపై కేసు నమోదు

యువకుడి అదృశ్యంపై కేసు నమోదు

కొత్తవలస: మండలంలోని గులివిందాడ గ్రామానికి చెందిన కోట దుర్గాప్రసాద్‌ (22) అదృశ్యం కావడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసినట్లు కొత్తవలస పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దుర్గాప్రసాద్‌ నర్సీపట్నం సమీపంలోని ఓ కోల్లఫామ్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. కాగా గత నెల 27వ తేదీన సెలవుపై సొంతూరు వెళ్తున్నట్లు ఫామ్‌ యజమానికి తెలిపాడు. అదే రోజు కొత్తవలసలో దుర్గాప్రసాద్‌ తన బావమరిదికి కనిపించినప్పటికీ ఇంటికి మాత్రం చేరలేదు. యువకుడి మోటర్‌ సైకిల్‌ విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ వద్ద పార్కింగ్‌ చేసి ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు దుర్గాప్రసాద్‌ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement