
సీజ్చేసిన జేసీబీ అప్పగింత
చీపురుపల్లి:
దేవదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఓ ఇంటిని కూల్చేందుకు తీసుకెళ్లిన ఓ ప్రైవేటు జేసీబీను రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు చీపురుపల్లి పోలీసులు సీజ్చేసిన సంగతి తెలిసిందే. దీనిని దేవదాయశాఖ అధికారులు కూడా ఖండించారు. తాము జేసీబీని అద్దెకు తీసుకెళ్లినట్టు వివరణ ఇచ్చినా పోలీసులు వినకపోవడంతో ‘ఇదెక్కడి రాజ్యాంగం’ అనే శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. తక్షణమే జేసీబీని యజమానికి అప్పగించాలని చీపురుపల్లి పోలీసులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జేసీబీను రిలీజ్ చేశారు. పోలీసుల సూచన మేరకు యజమాని దుర్గారావు తన డ్రైవర్ను తీసుకెళ్లి జేసీబీని ఇంటికి తీసుకెళ్లిపోయారు. అన్యాయంపై స్పందించిన ‘సాక్షి’కి, నిబంధనలకు విరుద్ధంగా జేసీబీ సీజ్ చేయడంపై పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
‘సాక్షి’ కథనానికి స్పందించిన పోలీస్ యంత్రాంగం

సీజ్చేసిన జేసీబీ అప్పగింత