
ప్రతి విద్యార్థికి స్కూల్ కిట్లు అందాలి
ఆరిలోవ: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచిన వెంటనే విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు అందించాలని కేజీబీవీ కార్యదర్శి, జిల్లా నోడల్ ఆఫీసర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. విశాఖ జిల్లాలో మండల హెడ్క్వార్టర్లలో విద్యార్థి మిత్ర కిట్లు ఉన్న పలు స్టాక్ పాయింట్లను గురువారం సందర్శించారు. ఇందులో భాగంగా చినగదిలి మండలం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టాక్ పాయింట్ను పరిశీలించారు. అక్కడ కిట్లలో పాఠ్య పుస్తకాలు, బెల్టులు, బ్యాగులు పరిశీలించి, డీఈవో కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ డీఈవో ఎన్.ప్రేమ్కుమార్తో కలసి ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎంఈవోలతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి విద్యార్థి మిత్ర కిట్లను అందించాలన్నారు. 121సి అడ్మిషన్ల విషయంలో ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్తో మాట్లాడి విద్యార్థులందరికీ ప్రవేశాలు పొందేవిధంగా జాగ్రతలు తీసుకోవాలన్నారు. ఈ నెల 21న విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ విజయవంతానికి అందరు ఎంఈవోలు భాగస్వాములు కావాలని సూచించారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టి పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు ప్రవేశాలు జరిగేటట్లు చూపడాలిన్నారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఏపీసీ జె.చంద్రశేఖర్, సెక్టోరియల్ ఆఫీసర్లు, ఎంఈవోలు పాల్గొన్నారు.