
యోగాంధ్రలో భాగస్వాములు కండి
ఎంవీపీకాలనీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 21న నిర్వహించే యోగాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు పిలుపునిచ్చారు. యోగాంధ్ర సన్నద్ధతలో భాగంగా ఓం ప్రీ యోగా ఆధ్వర్యంలో 800 మంది సాధకులతో శనివారం యోగాసనాల ప్రదర్శన నిర్వహించారు. ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా సంస్థ నిర్వాహకుడు డాక్టర్ చిలకా వెంకట రమేష్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అతిథులతో పాటు సాధకులతో రమేష్ యోగాసనాలు వేయించారు. సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, గాదిరాజు వర్మ, ఓం ప్రీ యోగా అధ్యక్షుడు కె.శాంతారాం, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, ఆయుష్ విభాగ అధికారి ఝాన్సీ, శ్రీ విశ్వం గ్రూప్ ధర్మరాజు, తమేర మల్టీస్పెషల్ స్కిన్ క్లినిక్ నిర్వాహకులు వెంకటరమణ, శాంతి తదితరులు పాల్గొన్నారు.
చికెన్ (కిలో) (వెన్కాబ్)
ఫారంధర : రూ.95
బ్రాయిలర్ (లైవ్) : రూ.115
స్కిన్ : రూ.200
స్కిన్లెస్ : రూ.210
చికెన్ ధరలు

యోగాంధ్రలో భాగస్వాములు కండి