
స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సమస్యలు
68 వార్డ్డులో సమస్యలను కార్పొరేటర్ గుడివాడ అనూష లతీష్ కౌన్సిల్కు వివరిస్తూ.. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చారు. అక్కిరెడ్డిపాలెం హైస్కూల్ నుంచి పంచవటి వరకు ప్రధాన రహదారి విస్తరణ, విశాఖ డెయిరీ కాలుష్యం, మింది, అక్కిరెడ్డిపాలెం గ్రామాల నుంచి పోర్టు రోడ్డు డ్రెయిన్కు కనెక్టయిన కాలువలు నిర్మించాలని, మింది తాగునీటి ట్యాంక్ నిల్వ సామర్థ్యం పెంచాలని, రామ్నగర్, కాళికానగర్లో కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. గుడివాడ అప్పన్న కాలనీలో రోడ్డు విస్తరణ పూర్తి చేయాలని కోరారు.