
గళమెత్తారు
పలు అంశాలపై నిలదీత..
శ్రీహరిపురంలో ఎఫ్ఆర్యూకి సంబంధించి మేయర్ను డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్ నిలదీశారు. అలాగే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సీనియర్ అసిస్టెంట్ వెంకట్రావు చేసిన ఫ్రాడ్కి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. వార్డులో రోడ్డు పనులు మంజూరైనప్పటికీ ఇంతవరకు పనులు ప్రారంభించక పోవడంపై ప్రశ్నించారు.
డాబాగార్డెన్స్: కొత్త మేయర్ పీలా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన తొలి నగరపాలక సంస్థ సమావేశంలోనే అధికార కూటమికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చుక్కలు చూపించారు. సెంట్రల్ ఏసీ హాల్లోనూ మేయర్తో పాటు పాలకపక్ష సభ్యులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రజల సమస్యలపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు గళమెత్తడంతో, మేయర్ నీళ్లు నమలాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ తీరును నిలదీస్తుంటే ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మేయర్గా తన తొలి సమావేశం ఏకపక్షంగా సాగేలా స్క్రీన్ప్లే రచించినా, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఎదురుదాడికి దిగడంతో మేయర్కు తొలి సమావేశంలో చేదు అనుభవం ఎదురైంది.
మేయర్, కూటమి సభ్యుల నాటకానికి తెర
జీవీఎంసీ కమిషనరే రాకపోతే కౌన్సిల్కు ఏం మర్యాద ఉంటుందని.. కచ్చితంగా రావాల్సిందేనని డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, జీవీఎంసీ వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ నేతృత్వంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఇన్చార్జ్ కమినర్ వచ్చేంత వరకు సభ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. దీంతో మేయర్ పీలా శ్రీనివాసరావు కౌన్సిల్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే టీ బ్రేక్ ప్రకటించారు. ఈ సమయంలోనే జీవీఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ను కౌన్సిల్కు పిలిపించినట్టు తెలుస్తోంది.
పార్కులు కబ్జా అవునత్నా..
కౌన్సిల్లో కూటమి తీరును ఎండగట్టారు ప్రజా సమస్యలపై నినదించిన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు మేయర్తో పాటు పాలకపక్ష సభ్యులు ఉక్కిరిబిక్కిరి

గళమెత్తారు