
విజయనగరం వరకే రాయగడ ఎక్స్ప్రెస్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పరిధి రాయగడ–విజయనగరం సెక్షన్లో జరుగుతున్న మూడో లైన్ పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను జూన్ 2,3 తేదీల్లో రద్దు చేశారు. మరికొన్నింటిని గమ్యం కుదించడంతో పాటు రీషెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు.
రద్దు చేసిన రైళ్లు
● జూన్ 2న విశాఖపట్నం–కోరాపుట్–విశాఖపట్నం(58538 / 58537) పాసింజర్, విశాఖపట్నం–కోరాపుట్(18512) బై–వీక్లీ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం–రాయ్పూర్–విశాఖపట్నం(58528/58527) పాసింజర్
● జూన్ 3న కోరాపుట్–విశాఖపట్నం(18511) బై–వీక్లీ ఎక్స్ప్రెస్
గమ్యం కుదించిన రైళ్లు
● జూన్ 1న గుంటూరు–రాయగడ(17243) ఎక్స్ప్రెస్ విజయనగరం వరకు మాత్రమే నడుస్తుంది. జూన్ 2న రాయగడ–గుంటూరు(17244) ఎక్స్ప్రెస్ విజయనగరం నుంచి బయలుదేరుతుంది.
రీషెడ్యూల్ చేసిన రైళ్లు
● జూన్1న ఎర్నాకుళం– టాటా (18190) ఎక్స్ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా ఉదయం 10.15 గంటలకు బయలుదేరుతుంది. అలప్పుజ–ధన్బాద్(13352) బోకారో ఎక్స్ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా ఉదయం 8 గంటలకు బయలుదేరుతుంది.
● జూన్ 2న దుర్గ్–విశాఖపట్నం(20829) వందేభారత్ ఎక్స్ప్రెస్ నాలుగున్నర గంటలు ఆలస్యంగా ఉదయం 10.15 గంటలకు, విశాఖపట్నం–దుర్గ్(20830) వందేభారత్ ఎక్స్ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా రాత్రి 6.50 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైళ్లు అంతే ఆలస్యంగా ఆయా స్టేషన్లకు రాకపోకలు సాగిస్తాయని, ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని డీసీఎం సూచించారు.