గెలుపే లక్ష్యంగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Jun 9 2025 7:58 AM | Updated on Jun 9 2025 7:58 AM

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

కడ్తాల్‌: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలని యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవతను ఆదివారం పార్టీ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కష్టపడే కార్యకర్తలు, నాయకులను పార్టీ తప్పకుండా గుర్తిస్తుందనిన్నారు. కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మీకాంత్‌రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు ధళపతిగౌడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బోసురవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement