చేపలకు భలే గిరాకీ | - | Sakshi
Sakshi News home page

చేపలకు భలే గిరాకీ

Jun 9 2025 7:58 AM | Updated on Jun 9 2025 7:58 AM

చేపలక

చేపలకు భలే గిరాకీ

అనంతగిరి: మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆదివారం వికారాబాద్‌ చేపల మార్కెట్‌లో ఽకొనుగోళ్లతో కిటకిటలాడింది. ఆనవాయితీ ప్రకారం ఈ రోజు చేపలను తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రజల విశ్వాసం. దీంతో వాటి ధరలు రోజు కంటే ఎక్కువగా పలికినావినియోగదారులు కొనడానికి ఆసక్తికనబర్చారు.

తాండూరు: తాండూరు పట్టణంలో చేపల విక్రయాలు జోరుగా సాగాయి. ఆదివారం మృగశిర కార్తె కావడంతో మీనాలు తింటే ఆరోగ్య సమస్యలు రావంటూ జనాలు విశ్వసిస్తారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు రకాల చేపలు స్థానిక మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో చేపలను కొనుగోలు చేసేందుకు జనాలు పోటీ పడ్డారు.

మర్పల్లిలో..

మర్పల్లి: మృగశిర కార్తె సందర్భంగా అన్నదాతలు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. ఆదివారం కార్తె ప్రవేశించడంతో చేపల విక్రయాలు జోరుగా సాగాయి. మండలంలో కొంషేట్‌పల్లి ప్రాజెక్టు, రావులపల్లి, తిమ్మాపూర్‌ చెరువులలో మాత్రమే మత్స్యకారులు చేపలు పట్టారు. భూగర్భ జలాలు అడుగంటడంతో ఆశించిన మేర చేపలు వృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

చేపలకు భలే గిరాకీ 1
1/2

చేపలకు భలే గిరాకీ

చేపలకు భలే గిరాకీ 2
2/2

చేపలకు భలే గిరాకీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement