పదకొండేళ్లు సుపరిపాలనే | - | Sakshi
Sakshi News home page

పదకొండేళ్లు సుపరిపాలనే

Jun 5 2025 8:10 AM | Updated on Jun 5 2025 8:10 AM

పదకొండేళ్లు సుపరిపాలనే

పదకొండేళ్లు సుపరిపాలనే

అనంతగిరి: ప్రధాని నరేంద్రమోదీ పదకొండేళ్లు సుపరిపాలన అందించారని, ప్రపంచానికి ఆదర్శనాయకుడని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ అన్నారు. బుధవారం వికారాబాద్‌లో భారత ప్రధాని నరేంద్రమోదీ పాలన 11సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఇచ్చిన నెల రోజుల కార్యాచరణపై ఒక్క రోజు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నెలరోజులు పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆమె వివరించారు. 11 సంవత్సరాలు బీజేపీ చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జిల్లా, మండల స్థాయిలో కార్యక్రమ ఇంచార్జిలను నియమించాలన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ పాలన అవినీతిరహిత పాలన అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాజశేఖర్‌, కార్యక్రమ ఇంచార్జి శేరి శ్రీధర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సదానందారెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు శివరాజు, పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, సీనియర్‌ నాయకులు ఈశ్వరప్ప, వడ్లనందు, సుచరితారెడ్డి, సాహు శ్రీలత, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ

నరేంద్రమోదీ ప్రపంచానికే

ఆదర్శ నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement