
కోవిడ్ కట్టడికి అలర్ట్..
కొత్త వేరియంట్ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్న వైద్య ఆరోగ్యశాఖ
సూర్యాపేటటౌన్ : దేశంలో ఐదేళ్ల తర్వాత మళ్లీ కరోనా కొత్త వేరియంట్ వస్తుండడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో కరోనా కేసులు నమోదైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు హుజూర్నగర్లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఐసోలేషన్వార్డులు ఏర్పాటు చేశారు. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ కిట్లు, మందుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు.
ర్యాపిట్ కిట్ల కోసం ప్రతిపాదనలు
కొత్త వేరియంట్ రూపంలో కరోనా ముప్పు పొంచి ఉందన్న వార్తల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ సన్నద్ధమవుతోంది. కరోనా మొదటి, రెండో వేవ్ సమయంలో జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు హుజూర్నగర్, కోదాడ, తుంగతుర్తి, నడిగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులు, ఆక్సిజన్ ప్లాంట్లు, కాన్సన్ట్రేటర్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆక్సిజన్, కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే కరోనా పరీక్షలకు సంబంధించి ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ కిట్లు, మందుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
20 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు..
కరోనా ముందస్తు చర్యల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఒక వార్డులో 20 బెడ్లతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఈ వార్డులో చికిత్స అందిస్తారు. ప్రతి బెడ్కు ఆక్సిజన్ అందుబాటులో ఉంచడంతోపాటు కరోనా నివారణకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో..
కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి కరోనా సోకిన వ్యక్తులు వస్తే చికిత్స అందించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఒకవేళ తీవ్ర జ్వరం కోవిడ్ లక్షణాలతో రోగులు వస్తే ప్రత్యేకంగా ఉంచడానికి వైద్యశాలలో ఒక గది ఉందని, దానిలో ఉంచి చికిత్స అందిస్తామని వైద్యశాల సిబ్బంది చెబుతున్నారు. కోదాడ వైద్యశాలలో ఆక్సిజన్ ప్లాంట్ కూడా అందుబాటులో ఉంది. రోగులు వస్తే చికిత్స అందించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెబుతున్నారు.
ఫ సూర్యాపేట, హుజూర్నగర్లో
ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు
ఫ ఆక్సిజన్ ప్లాంట్లు, కాన్సన్ట్రేటర్లను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం
ఫ ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ కిట్లు, మందుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ఫ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు డాక్టర్ల సూచన
హుజూర్నగర్లో తొమ్మిది బెడ్లు..
కోవిడ్ కొత్త వేరియంట్ నేపథ్యంలో హుజూర్నగర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులు అప్రమత్తం అయ్యారు. ఆస్పత్రిలో మూడు ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశారు. ఒక్కో వార్డులో మూడు బెడ్ల చొప్పున మొత్తం తొమ్మిది బెడ్లను సిద్ధం చేసి ఉంచారు. ఆక్సిజన్ సిలిండర్, కాన్సన్ట్రేటర్లను అందుబాటులో ఉంచారు.
స్వీయ నియంత్రణ పాటించాలి
ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. కరోనా వైరస్పై జిల్లా వైద్యశాఖ అప్రమత్తంగా ఉంది. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహిస్తాం. జిల్లాలో ఇంకా కరోనా కేసులు నమోదు కాలేదు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశాం.
–డాక్టర్ చంద్రశేఖర్,
జిల్లా ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ, సూర్యాపేట

కోవిడ్ కట్టడికి అలర్ట్..

కోవిడ్ కట్టడికి అలర్ట్..