రంగనాథస్వామి ఆలయ భూముల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

రంగనాథస్వామి ఆలయ భూముల పరిశీలన

Jun 7 2025 1:18 AM | Updated on Jun 7 2025 1:18 AM

రంగనా

రంగనాథస్వామి ఆలయ భూముల పరిశీలన

కోదాడ: పట్టణపరిధిలోని రామిరెడ్డిపాలెం వద్దఉన్న అనంతగిరికి చెందిన రంగనాథస్వామి ఆలయ భూములను శుక్రవారం రెవెన్యూ, దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ సభ్యులు పరిశీలించారు. గత నెల 31న శ్రీఆగని ఆలయ భూమి ఆక్రమణ యత్నాలుశ్రీ శీర్షికన సాక్షిలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. సర్వే నంబర్‌ 1024, 1025లో ఉన్న భూమి మొత్తం 24 ఎకరాలను సర్వే చేయాలని నిర్ణయించారు. దేవాలయ భూములను పరిశీలించిన వారిలో జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు ఈదుల కృష్ణయ్య, ఆలయ కమిటీ చైర్మన్‌ తీగల నరసింహారావు, అనంతగిరి డీటీ శ్రీధర్‌, సర్వేయర్‌ నాగార్జున తదితరులు ఉన్నారు.

ముగిసిన వేసవి శిబిరం

సూర్యాపేట : బాల భవన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నెల రోజులుగా కొనసాగుతున్న వేసవి ఉచిత శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగింది. శిబిరం ముగింపు సందర్భంగా విద్యార్థులు గాత్ర సంగీతం, వాయిద్యం, కుట్లు అల్లికలు, చిత్రలేఖనం నృత్యంతో పాటు మెడిటేషన్‌, సైన్స్‌ ప్రయోగ అంశాలను ప్రదర్శించి అలరించారు. ఈ కార్యక్రమానికి బాల భవన్‌ అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్‌ రామ్మూర్తి హాజరై తిలకించి విద్యార్థులు, శిక్షకులను అభినందించారు. కార్యక్రమంలో బాల భవన్‌ సూపరింటెండెంట్‌ బండి రాధాకృష్ణారెడ్డి రిటైర్డ్‌ అధ్యాపకులు కవి హమీద్‌ఖాన్‌, అనంతుల జయ మ్మ, వెంపటి రాము, బాల భవన్‌ పేరెంట్స్‌ కమిటీ వెన్న కవితారెడ్డి, కార్టూనిస్టు పల్లె మణిబాబు, వెంకటేశ్వర్లు, మెడిటేషన్‌ గురువు భీష్మారెడ్డి, దాసరి ఎల్లయ్య, ఉమ, సత్యనారాయణ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు రుణాల

మంజూరు సులభతరం

నల్లగొండ టౌన్‌ : రైతులకు రుణాల మంజూరు సులభం చేయడం కోసం పాలసీల్లో మార్పులు చేసినట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ చైర్మన్‌ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సహకార బ్యాంకు అంటేనే రైతుల బ్యాంక్‌ అని రైతుల అభివృద్ధికి బ్యాంకు సహాయ పడుతుందని తెలిపారు. రైతులు బ్యాంకులో రుణం పొంది ఏదైనా కారణం చేత మరణిస్తే వారికి ఓటీఎస్‌ (వన్‌టైం సెటిల్‌మెంట్‌) సదుపాయం కల్పించాలని తీర్మాణించినట్లు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్రాఫ్‌ వైజ్‌గా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను ఆమోదిస్తున్నామన్నారు. సమావేశంలో డైరెక్టర్లు ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి, గొంగిడి మహేందర్‌రెడ్డి, సీఈఓ శంకర్‌రావు పాల్గొన్నారు.

రంగనాథస్వామి ఆలయ భూముల పరిశీలన
1
1/3

రంగనాథస్వామి ఆలయ భూముల పరిశీలన

రంగనాథస్వామి ఆలయ భూముల పరిశీలన
2
2/3

రంగనాథస్వామి ఆలయ భూముల పరిశీలన

రంగనాథస్వామి ఆలయ భూముల పరిశీలన
3
3/3

రంగనాథస్వామి ఆలయ భూముల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement