
ఇక్కడి ప్రజల అదృష్టం
– ప్రభుత్వ విప్ అయిలయ్య
ఆలేరు పేరును సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు అని, ఒకేసారి రూ.1000 కోట్లపైనా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు శంకుస్థాపన చేయడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నట్టు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గంధమల్లను రిజర్వాయర్ను నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజాప్రభుత్వంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సహకారంతో మల్లన్నసాగర్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో 100కు పైగా చెరువును నింపుకున్నామన్నారు. గత ప్రభుత్వం గ్రామాల్లో పాఠశాలలకు బదులుగా మద్యం దుకాణాలు ఇస్తే.. సీఎం రేవంత్రెడ్డి ప్రజా ప్రభుత్వంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు, మెడికల్ కళాశాలలను నిర్మాణం చేస్తుందన్నారు.