
వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నాం
– మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని చెప్పారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు చాలా పవర్ఫుల్ అని, ఆయన దీవెనలతోనే తమ ప్రభుత్వం వచ్చిందన్నారు. దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భక్తులు కల్పించాలని సౌకర్యాలపై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయడంతో పాటు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో డ్రెయినేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరో ఐదేళ్లు కాంగ్రెస్దే అధికారమన్నారు. ప్రతి కుటుంబంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నారు.