
ప్రతి పేదవాడికి ఆహారభద్రత
– మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఆహారభద్రత కల్పించడమే ధ్యేయమని భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ కల నేరవేర్చేందుకే సన్నబియ్యం పథకం తీసుకువచ్చి, అమలు చేస్తున్నామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి వ్యక్తి, ప్రతి రైతు మూసీ పునరుజ్జీవానికి మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. బునాదిగాని కాల్వ, పిల్లాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వలను పూర్తి చేస్తామని, భూసేరణ బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు. గంధమల్ల రిజర్వాయర్ను ముంపు లేకుండా సామర్థ్యాన్ని 1.4 టీఎంసీలకు తగ్గించి 60 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.