నెలకు సరిపడా మందులను
ఆనందంగా ఇంటికి తీసుకెళ్తున్న వృద్ధులు
ఈదుపురం పీహెచ్సీ వద్ద వైద్యం కోసం పడిగాపులు కాస్తున్న రోగులు
కొన్ని రోజుల కిందట మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా తన నియోజకవర్గంలో పలు పీహెచ్సీలు పరిశీలించారు. అందులో పరిస్థితులు గమనించి ‘మీ డాక్టర్లకు జీతాలే దండగ.. ఎవ్వరూ సమయానికి రారు.. వచ్చినా..ఉండరు’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. పల్లెల్లో వైద్యం ఎంతమాత్రం అందుతుందో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. కానీ ఏడాది కిందటి వరకు పరిస్థితి వేరు. ‘ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్’ పల్లెను బాగు చేసింది. ఊరి బాగోగులు చూసుకుంది. వీధి ముంగిటే అందరికీ సేవలు అందించి గ్రామీణ వాసులందరికీ చేరువైంది. కూటమి రాకతో ‘ఫ్యామిలీ డాక్టర్’ మాయమైపోయాడు. పేదలు ప్రభుత్వాస్పత్రి ఓపీలో నిలుచునే ఓపిక తెచ్చుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసేసింది.
● కూటమి ప్రభుత్వంలో కనిపించని గ్రామీణ వైద్య సేవలు
● గత ప్రభుత్వంలో ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంతో పల్లె గడపలోనే వైద్య సేవలు
● నాడు 64 పీహెచ్సీల పరిధిలో అద్వితీయంగా సాగిన ఎఫ్పీసీ విధానం
● నేడు పల్లెల్లో మచ్చుకై నా కనిపించని వైద్య బృందాలు
ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ విధానంలో భాగంగా పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లోకి నెలకు రెండు సార్లు వెళేవారు. ఆయా గ్రామస్తుల్లో వైద్యపరీక్షలు అవసరమైన వారిని గుర్తించి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 104 మొబైల్ యూనిట్ సిబ్బంది సమక్షంలో మొత్తం 14 రకాల వైద్య పరీక్షలను అక్కడే నిర్వహించి ఫలితాలను తెలియజేసేలా వ్యవస్థను నడిపించారు. హిమోగ్లోబిన్ టెస్ట్, ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్, మలేరియా టెస్ట్, హెచ్ఐవీ నిర్దారణ, డెంగీ టెస్ట్, మల్టీ పారా యూరిన్ స్ట్రిప్స్, అయోడిన్ టెస్ట్, గర్భం నిర్దారణకు యూరిన్ టెస్ట్, వాటర్ టెస్టింగ్, హెపటైటస్ బి నిర్ధారణ, ఫైలేరియాసిస్ టెస్ట్, సిప్లిస్ ర్యాపిడ్ టెస్ట్, విజువల్ ఇన్ఫెక్షన్, స్పుటమ్ (ఏఎఫ్బి) తదితర 14 రకాల వైద్య పరీక్షలను గ్రామాల్లోనే నిర్వహించేవారు. కానీ నేడు అలాంటి పరిస్థితులు కానరావడం లేదు. దీంతో ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు.
అరసవల్లి:
ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్... దేశంలో మొట్టమొదటి సారిగా ఓ డాక్టర్ను ఊరికి పంపించి వారికి పరీక్షలు చేయించి మందులు అందజేసి ఆరోగ్యవంతులను చేసే ఈ మహత్తరమైన పథకానికి వైఎస్ జగన్ రూపకల్పన చేశారు. 2022 అక్టోబర్ 21 నాడు ట్రయల్ రన్గా ప్రారంభించిన ఈ విధానం క్రమేణా లక్షలాది మందికి సేవలు అందించింది. పేద, సామాన్యుల కోసం ఏకంగా ప్రభుత్వ వైద్యుడే ఆయా గ్రామాలకు ఫ్యామిలీ డాక్టర్గా పరిచయమయ్యేలా ఫోన్ నంబర్ ఇచ్చి మరీ ఫాలో అప్ చేసేవారు. ఉదయం ఓపీ చూసి ఉచిత మందులివ్వడం, సాయంత్రం నుంచి ఇళ్లకు వెళ్లి మంచాన పడిన రోగులను కలిసి మాట్లాడి సలహాలివ్వడం వంటి సేవలు అందించడం జరిగేది. ఈ వ్యవస్థ కోసం ఏకంగా జిల్లాలో 66 పీహెచ్సీల్లో 14 మంది సిబ్బంది ఉండేలా కొత్త క్యాడర్స్ట్రెంత్ను అమలు చేసి కొత్తగా నియామకాలను చేపట్టారు.
మరి నేడు చూస్తే..
గ్రామాల్లో వైద్యసేవలు దేవుడెరుగు.. అసలు పీహెచ్సీల్లో వైద్యులే రాని పరిస్థితి నెలకొంది. ఇక జిల్లా వైద్యారోగ్య శాఖ విషయానికొస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక అవినీతి అక్రమాలపై ఉన్న శ్రద్ధ గ్రామీణ వైద్య సేవలపై పెట్టడం లేదు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులోనే ఉందని డీఎంహెచ్ఓ చెబుతున్నా.. ఎక్కడా ఆ ప్రక్రియ జరగడం లేదు. ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానానికి అప్పట్లో గ్రామాలకు నెలకు రెండు రోజుల చొప్పున విజిట్స్ ఉండేలా షెడ్యూల్ ఉండేది. 104 వాహనంతో పాటుగా పరిధి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ స్వయంగా సిబ్బందితో వెళ్లి వైద్య పరీక్షలతో పాటు ఉచిత మందులను ఇవ్వడమే కాకుండా ఇంటింటికీ వెళ్లి ఫాలోఅప్ వైద్య సలహాలను ఇచ్చేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా ‘ఫ్యామిలీ డాక్టర్’ మాత్రం అడుగు తీసి అడుగు వెయ్యలేదు.
నాడు నియామకాలు..నేడు నిర్లక్ష్యాలు
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం. జిల్లాలో మొత్తం 66 పీహెచ్సీల పరిధిలో మొత్తం 591 విలేజి హెల్త్ క్లినిక్స్ ఉండగా.. ఈ ఎఫ్పీసీ విధానం కోసం ప్రతి పీహెచ్సీకి ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఉండాలనే క్రమంలో మొత్తం 132 మంది కొత్తగా వైద్యులను నియమించింది. అలాగే 14 మంది క్యాడర్ స్ట్రెంత్ కోసం ప్రతి పీహెచ్సీలో కొత్తగా 620 వరకు పోస్టులను కూడా భర్తీ చేసింది. అలాగే కొత్తగా మొబైల్మెడికల్ యూనిట్ (104వాహనం) లను 25 వాహనాలను జిల్లాకు కేటాయించింది. తగిన టెక్నీషియన్లను కేటాయించింది. దీంతో 2022 అక్టోబర్ 21 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు జిల్లాలో సుమారు 3.60 లక్షల మందికి గ్రామీణ వైద్య సేవలందించింది.
కూటమి వచ్చాక పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఏడాదిగా ఒక్క నియామకం లేదు సరికదా గత ఏడాది డిసెంబర్ 5న జిల్లాలో మొత్తం 123 మంది కాంట్రాక్ట్ మేల్ హెల్త్ అసిస్టెంట్లకు ఉద్యోగాల నుంచి ఉద్వాసన పలికారు. ఇది చాలదన్నట్లుగా నకిలీ జాయినింగ్ ఆర్డర్ల వ్యవహారాలు, జిల్లా కార్యాలయం వేదికగా అక్రమ వ్యవహారాలు నడిచేలా కూటమి పాలకుల చర్యలున్నాయి.
వైద్య సేవలు తగ్గిపోయాయి
ప్రైవేటు
వైద్యులే గతి
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రత్నాల సింహాచలం. ఎల్ఎన్ పేట మండలంలోని బొత్తాడసింగి గ్రామం. 2023 అక్టోబర్ నెలలో ఎల్.ఎన్.పేట బొత్తాడసింగి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఈయనకు కళ్లద్దాలు అవసరమని గుర్తించి, 20 రోజుల్లో కంటి అద్దాలు ఇచ్చారు. అంతకుముందు ఈయన కళ్లద్దాల కోసం పట్టణాలకు కూడా వెళ్లారు. కానీ జగనన్న ఆరోగ్య సురక్షతో ఊరిలోనే చక్కటి వైద్యం లభించింది. వైఎస్ జగన్ హయాంలో వైద్యరంగం బాగుపడిందని చెప్పడానికి ఈయన కంటి చూపే సాక్షి.
ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ వల్ల పేదలపై ప్రయా ణ భారం పడకుండా ఊరిలోనే వైద్య సేవలు అందేవి. ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి. గతి లేక ప్రైవేటు వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోంది. – గొర్లె శ్రీరాములునాయుడు, మురపాక, లావేరు మండలం.
మాది ఎచ్చెర్ల మండలం అల్లినగరం. ఇదివరకు ఇంటి వద్దకు డాక్టర్లు వచ్చి తనిఖీలు చేసి మందులు ఇచ్చేవారు. ఇప్పుడు ఎవరూ రావడం లేదు. చీటికీ మాటికీ ఎచ్చెర్ల ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్లి మందులు తెచ్చుకోవాల్సి వస్తోంది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. – వై.సూరయ్య, అల్లినగరం, ఎచ్చెర్ల మండలం
గతంలో ఫ్యామిలీ డాక్టర్ విధానంతో రోజూ వైద్యులు ఊరికి వచ్చి మందులు ఇచ్చేవారు. ఉన్నత చికిత్స అవసరమైతే వారే పంపించేవారు. ప్రస్తుతం గ్రామాల్లో వైద్యసేవలు పూర్తిగా కనుమరుగైపోయాయి. – బెవర కృష్ణవేణి, పాతపాడు
ఇబ్బందులు పడుతున్నాం..
ఇబ్బందులు పడుతున్నాం..
ఇబ్బందులు పడుతున్నాం..
ఇబ్బందులు పడుతున్నాం..
ఇబ్బందులు పడుతున్నాం..
ఇబ్బందులు పడుతున్నాం..
ఇబ్బందులు పడుతున్నాం..
ఇబ్బందులు పడుతున్నాం..
ఇబ్బందులు పడుతున్నాం..
ఇబ్బందులు పడుతున్నాం..
ఇబ్బందులు పడుతున్నాం..