
రాష్ట్ర స్థాయి మహిళల హాకీ పోటీల్లో జిల్లాకు కాంస్య పతక
ధర్మవరం రూరల్: హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో భీమవరం వేదికగా మూడు రోజులుగా జరుగుతున్న 15వ రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీల్లో జిల్లా జట్టుకు కాంస్య పతకం దక్కింది. ఈ మేరకు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్ , మేనేజర్ అరవింద్ గౌడ్, కోచ్ మారుతీకుమార్ ఆదివారం తెలిపారు. మొదటి లీగ్ మ్యాచ్లో నంద్యాల జిల్లా జట్టుపై 16–0, రెండో రోజు నెల్లూరు జిల్లా జట్టుపై 11–0, తిరుపతి జిల్లా జట్టుపై 3–1 స్కోరుతో విజయం సాధించి సెమీపైనల్కు జిల్లా జట్టు చేరుకుంది. అనంతపురం జిల్లా జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో పెనాల్టీ షూట్ అవుట్లో 3–2 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. మూడో స్థానం కోసం ప్రకాశం జిల్లా జట్టుతో తలపడి 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. జిల్లాకు చెందిన హేమ బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ది టోర్నీగా అవార్డు దక్కించుకుంది. ప్రతిభ చాటిన జిల్లా క్రీడాకారులను జిల్లా స్పోర్ట్స్ ఆఽఽథారిటీ హాకీ కోచ్ హుస్సేన్, సీనియర్ క్రీడాకారులు బీవీ శ్రీనివాసులు, బండి వేణుగోపాల్, పళ్లెం వేణుగోపాల్, అంజన్న, గౌరీ ప్రసాద్, తదితరులు అభినందించారు.
● ఇదేనా సంపద సృష్టి!
గుంతకల్లు: తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టి చేసి ప్రజలకు పంపిణీ చేస్తామని హామీనిచ్చిన కూటమి పెద్దలు... అధికారం చేపట్టిన తర్వాత కంటికి కనిపించని దోపిడీకి తెరలేపారు. ఒకే దూరం.. ఒకే రకమైన ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి రూ.10 వ్యత్యాసంతో చార్జీలు వసూలు చేయడమే ఇందుకు నిదర్శనం. గుంతకల్లుకు చెందిన ఓ ప్రయాణికుడు ఆదివారం ఉదయం పల్లె వెలుగు బస్సులో బురుజల మీదుగా పత్తికొండకు వెళ్లాడు. 35 కి.మీ. దూరం ప్రయాణానికి రూ.40 టికెట్ ధర చెల్లించాడు. అనంతరం సాయంత్రం పల్లె వెలుగు బస్సులోనే బురుజల మీదుగా గుంతకల్లుకు చేరుకున్నాడు. ఇందుకు టికెట్ ధర రూ.50 చెల్లించాడు. ఉదయం రూ.40 తీసుకున్నారు... సాయంత్రం రూ.50 తీసుకుంటున్నారు ఎందుకంటూ కండక్టర్ను నిలదీయడంతో ఉదయం 35 కి.మీ. దూరం ఉందని, సాయంత్రం 40 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వస్తోందని కండక్టర్ తెలపడంతో ప్రయాణికులు అవాక్కయారు. ఈ వ్యత్యాసం వెనుక ఉన్న దోపిడీ ప్రభుత్వ పెద్దలకే తెలియాలని విమర్శలు గుప్పించారు.

రాష్ట్ర స్థాయి మహిళల హాకీ పోటీల్లో జిల్లాకు కాంస్య పతక

రాష్ట్ర స్థాయి మహిళల హాకీ పోటీల్లో జిల్లాకు కాంస్య పతక