మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

Jun 9 2025 8:08 AM | Updated on Jun 9 2025 8:08 AM

మద్యం

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

పుట్టపర్తి టౌన్‌: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులను పోలీసులు హెచ్చరించారు. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు అక్రమ రవాణా అరికట్టేలా చర్యలు తీసుకోవడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయడం, వాహనాలకు సరైన రికార్డులు లేకపోవడం, పెండింగ్‌ చలానాలు, తదితరాలను పరిశీలించారు. రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని, చలనాలు పెండింగ్‌ లేకుండా చెల్లించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలన్నారు. అలాగే పాత నేరస్తులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. శక్తి యాప్‌ వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించారు.

రైలు నుంచి జారి పడి

వ్యక్తి మృతి

గుత్తి: స్థానిక జీఆర్పీ పరిధిలోని జక్కలచెరువు – రాయలచెరువు రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం రైలు నుంచి జారిపడి ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం చౌదరిపల్లికి చెందిన వెంకటయ్యగా గుర్తించారు. రైలులో తలుపు వద్ద నిలబడి ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి కింద పడినట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. మృతదేహాన్ని గుత్తిలోని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు 1
1/1

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement