
ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
● డీఈఓ కార్యాలయ ముట్టడి
నెల్లూరు (టౌన్): సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఆదివారం ముట్టడించారు. కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కూల్ అసిస్టెంట్ల బదిలీల్లో జరిగిన అవకతవకలకు రివైజ్డ్ చేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సెలింగ్ను తప్పుల తడకగా నిర్వహించారని, క్లస్టర్ వేకెన్సీలకు ఎక్కువ పాయింట్లు వచ్చిన వారికి కాకుండా తక్కు వ పాయింట్లు వచ్చిన వారికి ఇచ్చారని చెప్పారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపాధ్యాయులు జనరల్ ఆప్షన్లు పెట్టినా ప్లేసులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. బాలికోన్నత పాఠశాలల్లో పురుష ఉపాధ్యాయులను కేటాయించడం లాంటి పొరబాట్లు జరిగాయన్నారు. ఈ రీతిలో విఫలమైన వెబ్ కౌన్సెలింగ్ను ఎస్జీటీలపై బలవంతంగా రుద్ద డం దుర్మార్గపు చర్యన్నారు. ఇప్పటికై నా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఎస్జీటీలకు మాన్యు వల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు సురేంద్రరెడ్డి, చలపతిశర్మ, అనిల్, నర సింహులు, హజరత్, కృష్ణారెడ్డి, మధుసూదనరావు, శివశంకర్రెడ్డి, ప్రసాద్, శ్రీనివాసులు, పద్మజ, మస్తాన్, మునీంద్ర, పిచ్చిబాబు, రాజగోపాలాచారి, శేషులు, దశరథరాము లు, అజయ్బాబు, డేవిడ్, సుబ్రహ్మణ్యం, సురేష్, సుజాత, రవి, రమేష్, నవకోటేశ్వరరావు, రియాజ్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి