భూవివాదంలో మహిళకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

భూవివాదంలో మహిళకు గాయాలు

Jun 9 2025 7:48 AM | Updated on Jun 9 2025 7:48 AM

భూవివ

భూవివాదంలో మహిళకు గాయాలు

ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని నరసాపురంలో 2.50 ఎకరాల భూ వివాదానికి సంబంధించి ఘర్షణ ఏర్పడి ఓ మహిళకు గాయాలయ్యాయి. పోలీసులు వివరాల మేరకు.. అల్లంపాటి మాధవరెడ్డి, పల్లవి దంపతులకు వారి పెద్దల నుంచి భూమి వచ్చింది. అందులో తమకు 30 సెంట్లు రావాలని వారి దూరపు బంధువులు అంటున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ సోమ్లానాయక్‌ గత బుధవారం రెవెన్యూ కోర్టు నిర్వహించారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో మరోసారి రెవెన్యూ కోర్టు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మాధవరెడ్డి దంపతులకు తెలియకుండా వారి బంధువులు ఆదివారం జేసీబీ సాయంతో 30 సెంట్లలో జామాయిల్‌ చెట్లు తొలగించి ఫెన్సింగ్‌ వేశారు. విషయం తెలుసుకుని సాయంత్రం పొలం వద్దకు వెళ్లిన మాధవరెడ్డి కుటుంబీకులపై వారు దాడికి పాల్పడ్డారు. ఇందులో పల్లవికి గాయాలయ్యాయి.

భూవివాదంలో మహిళకు గాయాలు 1
1/1

భూవివాదంలో మహిళకు గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement