
CBSE
ఇవీ నిబంధనలు..
సీబీఎస్ఈ పాఠశాలల ఏర్పాటుకు గానూ తొలుత జిల్లా విద్యాశాఖకు దరఖాస్తు చేసుకుంటారు. ఎంఈఓ లేదా డిప్యూటీ డీఈఓ వెళ్లి పరిశీలించాకే గుర్తింపును జారీ చేస్తారు. పాఠశాలల నిర్వహణ, సిలబస్, పరీక్షలు మా పరిధిలో ఉండవు. వీటిని బోర్డు అధికారులే చూసుకుంటారు. – బాలాజీరావు, డీఈఓ
సీబీఎస్ఈ సిలబస్కు డిమాండ్ ఉంది. ప్రస్తుత పోటీ పరీక్షల్లో ఈ విద్యార్థులే ఎక్కువగా రాణిస్తున్నారు. వీరిలో సృజనాత్మకతా ఎక్కువగా ఉంటుంది. బట్టీ విధానం ఉండదు. ఈ విద్యార్థులకు అన్ని రంగాల్లో ప్రావీణ్యత ఉంటుంది.
– గిరి, ప్రిన్సిపల్, డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల
జిల్లాలోని కార్పొరేట్ విద్యాసంస్థలు రూటు మార్చాయి. ఇప్పటి వరకు స్టేట్ సిలబస్పై దృష్టి సారించిన వీరి కళ్లు.. తాజాగా సీబీఎస్ఈపై పడ్డాయి. ఐఐటీ, నీట్, సివిల్స్
తదితర పోటీ పరీక్షల్లో ఈ విధానం ద్వారా విద్యనభ్యసించిన వారే ర్యాంకులను సాధిస్తున్నారనే ప్రచారం జోరందుకున్న తరుణంలో దీనిపై మక్కువ నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా ఖర్చు ఎంతైనా తమ పిల్లలను ఇక్కడే చదివించేందుకు తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న
యాజమాన్యాలు సీబీఎస్ఈ స్కూళ్లు ఏర్పాటు చేసి చక్కగా క్యాష్ చేసుకుంటున్నాయి.
●
ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది సీబీఎస్ఈ సిలబస్పైనే ఫోకస్ పెడుతున్నారు. పోటీ పరీక్షల్లో రాణించాలంటే ఈ విధానమే ప్రధానం. ఫ్యాకల్టీ, బోధనపై ఆరాతీశాకే పిల్లలను మంచి పాఠశాలల్లో చేర్పించాలి. దీన్ని చదివిన పిల్లలకే భవిష్యత్తులో ఉన్నతావకాశాలు ఉంటున్నాయి. – సుబ్రహ్మణ్యం, విశ్రాంత ప్రిన్సిపల్, వీఆర్సీ
జిల్లాలో ఇలా..
స్కూళ్లు – 25కుపైగా
విద్యార్థులు – దాదాపు 25 వేలు
ఫీజులు – రూ.40 వేల నుంచి
రూ.రెండు లక్షలు
● సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పాఠశాలల నిర్వహణ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతుంది. వీటి ఏర్పాటుకు తొలుత జిల్లా విద్యాశాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
● కిండర్ గార్డెన్ నుంచి ప్లస్ టూ వరకు లేదా కిండర్ గార్డెన్ నుంచి పదో తరగతి వరకు బోధనకు దరఖాస్తు చేసుకోవాలి.
● పాఠశాలకు రెండెకరాల స్థలం తప్పక ఉండాలి. ఒకే కాంపౌండ్లో ఈ స్థలం ఉందనే అంశమై రెవెన్యూ శాఖ నుంచి సర్టిఫికెట్ను పొందాల్సి ఉంటుంది. విశాల మైదానం, గాలి, వెలుతురొచ్చేలా తరగతి గదులు, శానిటరీ, ఫైర్, స్ట్రక్చరల్ సౌండ్లెస్ తదితర సర్టిఫికెట్లను విధిగా పొందాలి.
● క్వాలిఫైడ్ టీచర్లు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ ల్యాబ్లు తప్పనిసరి. ఎంఈఓ లేదా డిప్యూటీ డీఈఓ క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్ని పత్రాలున్నాయా అనే అంశాన్ని తనిఖీ చేశాకే గుర్తింపును జారీ చేస్తారు.
● రాష్ట్ర కమిషనరేట్ నుంచి ఎన్ఓసీ వచ్చాక మూడు నెలలకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గానూ లక్షన్నర నుంచి రూ.రెండు లక్షలను చలానా రూపంలో బోర్డుకు చెల్లించాల్సి ఉంటుంది. తదనంతరం బోర్డు సభ్యులు వచ్చి తనిఖీలు నిర్వహించి అనుమతులను మంజూరు చేస్తారు.
అంతా డొల్ల..
జిల్లాలో నాలుగైదు మినహా మిగిలిన సీబీఎస్ఈ పాఠశాలలను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. రెండెకరాల స్థలం ఏ స్కూల్కూ లేదు. అపార్ట్మెంట్లలో వీటిని నిర్వహిస్తున్న పరిస్థితీ ఉంది. రిజిస్టర్లో మాత్రమే క్వాలిఫైడ్ టీచర్ల పేర్లుంటాయి. వాస్తవానికి ఇంటర్, డిగ్రీ, పీజీ అధ్యాపకులే ఉంటారు. బీఈడీ, ప్లస్ – 2కు ఎంఈడీ చేసిన అధ్యాపకులు ఉండాలనే నిబంధన ఉన్నా, ఎక్కడా అమలుకు నోచుకోవడంలేదు. సరైన గాలి, వెలుతురు ఇలాంటివన్నీ మిథ్యే. తనిఖీల నిమిత్తం అధికారులొచ్చిన సమయంలో వారికి రూ.ఐదారు లక్షలను ముట్టజెప్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. దీంతో అన్నీ సక్రమంగానే ఉన్నాయనే నివేదికను తయారు చేసి గుర్తింపును జారీ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది.
తనిఖీలేవీ..?
సీబీఎస్ఈ పాఠశాలలను తనిఖీ చేసే అధికారులు కరువయ్యారు. వీటిని తనిఖీ చేసే అధికారం జిల్లా విద్యాశాఖ అధికారులకు లేదు. సెంట్రల్ బోర్డుకు ఫిర్యాదొస్తే తప్ప, వీటివైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. రెండేళ్లకో.. మూడేళ్లకోసారి వచ్చి ముడుపులు పుచ్చుకొని వెళ్తున్నారని సమాచారం. పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఆడిందే ఆట.. పాడింతే పాట అన్న చందంగా పరిస్థితి మారింది.
జిల్లాలోని 25కుపైగా సీబీఎస్ఈ పాఠశాలల్లో కిండర్ గార్డెన్ నుంచి ప్లస్ – 2 వరకు 25 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. డిమాండ్ పెరగడంతో ఫీజును ఆమాంతంగా పెంచేశారు. పాఠశాలను బట్టి రూ.40 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫారం తదితరాలకు అదనంగా గుంజుతున్నారు. కొన్ని పాఠశాలల్లో ఎన్సీఈఆర్టీ నుంచి వచ్చిన పుస్తకాలతో పాటు సొంత మెటీరియల్ను రూపొందించి అంటగడుతున్నారు. ఏటా 10 నుంచి 20 శాతం వరకు ఫీజులను అదనంగా వసూలు చేస్తున్నారు.
● ఇప్పుడు క్రేజంతా సీబీఎస్ఈపైనే
● పుట్టగొడుగుల్లా వెలుస్తున్న స్కూళ్లు
● నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ
● ఇష్టారాజ్యంగా ఫీజుల వసూళ్లు
● క్వాలిఫైడ్ ఫ్యాకల్టీలకు కరువు
రూటు మార్చిన కార్పొరేటు
నెల్లూరు(టౌన్): తల్లిదండ్రుల ఆశలు.. కొన్ని సీబీఎస్ఈ పాఠశాలల యాజమాన్యాలకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండానే వీటిని నిర్వహిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. జిల్లాలో గతంలో ఈ స్కూళ్ల సంఖ్య అతి స్వల్పం. అయితే ప్రస్తుతం 25 పాఠశాలలను నిర్వహిస్తున్నారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫీజులూ ఆకాశాన్నంటుతున్నాయి.
ఇదేమి ఫీజులు బాబోయ్..

CBSE

CBSE

CBSE