ఏపీఈఏపీ సెట్‌లో ఉత్తమ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page
breaking news

ఏపీఈఏపీ సెట్‌లో ఉత్తమ ప్రతిభ

Jun 9 2025 12:58 AM | Updated on Jun 9 2025 12:58 AM

ఏపీఈఏపీ సెట్‌లో ఉత్తమ ప్రతిభ

ఏపీఈఏపీ సెట్‌లో ఉత్తమ ప్రతిభ

సాఫ్ట్‌వేర్‌లో స్థిరపడాలనేదే లక్ష్యం

కందుకూరు విద్యార్థికి పదో ర్యాంక్‌

నెల్లూరు (టౌన్‌): ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, పార్మసీ (ఏపీఈఏపీ) సెట్‌ ఫలితాలను ఆదివారం విడుదల చేశారు. గత నెల 19 నుంచి 27 వరకు పరీక్షలను నిర్వహించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో జిల్లాలో 8913 మంది దరఖాస్తు చేసుకోగా, 8558 మంది పరీక్షలకు హాజరయ్యా రు. వీరిలో 5993 మంది అర్హత సాధించా రు. అగ్రికల్చర్‌, పార్మసీ విభాగంలో 2647 మంది దరఖాస్తు చేసుకోగా, 2448 మంది పరీక్ష కు హాజరయ్యారు. 2263 మంది అర్హత సాధించా రు. ఇంజినీరింగ్‌ విభాగంలో కందుకూరుకు చెందిన బద్రిరాజు వెంకటమణిప్రీతమ్‌ 92.43 శా తం మార్కులతో రాష్ట్రంలో పదో స్థానంలో నిలిచా రు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగంలో టాప్‌ టెన్‌లో జిల్లాకు చెందిన ఒకరూ ర్యాంక్‌ను సాధించలేదు.

కందుకూరులో నివాసం ఉంటున్న బద్రిరాజు వెంకట మణిప్రీతమ్‌ తండ్రి నారాయణమూర్తి, తల్లి రజిని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఏపీఈఏపీ సెట్‌లో ఇంజినీరింగ్‌ విభాగంలో 92.43 శాతం మార్కులను ప్రీతమ్‌ సాధించి రాష్ట్ర స్థాయిలో పదో ర్యాంక్‌ను దక్కించుకున్నారు. జేఈఈ మెయిన్స్‌లో జాతీయస్థాయిలో 129.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 234వ ర్యాంక్‌ను సాధించారు. ఉత్తమ ఐఐటీలో చదివి సాఫ్ట్‌వేర్‌లో స్థిరపడాలనేదే తన లక్ష్యమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement