
భక్తిశ్రద్ధలతో ప్రదోషకాల పూజలు
నెల్లూరు(బృందావనం): మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో నందీశ్వరుడు, మూలస్థానేశ్వరుడికి ప్రదోషకాల అభిషేకం, అమ్మవారికి అర్చనలను ఆదివారం నిర్వహించారు. చిన్న వెండి నందివాహనంపై ప్రాకారోత్సవాన్ని జరిపారు. ఈఓ అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు.
● నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో గల మీనాక్షి సమేత సుందరేశ్వరస్వామి ఆలయంలో నందీశ్వరుడు, సుందరేశ్వరుడికి ప్రదోషకాల పూజలు, అభిషేకాలను నిర్వహించారు. ఈఓ కోవూరు జనార్దన్రెడ్డి పర్యవేక్షించారు.

భక్తిశ్రద్ధలతో ప్రదోషకాల పూజలు