
4 లక్షల మంది తల్లుల ఎదురుచూపు
జిల్లాలో తల్లికి వందనం పథకానికి అర్హులైన సుమారు 4 లక్షలకు మందికిపైగా తల్లులు ఉన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంత మంది పిల్లలకు ఒక్కొక్కరికి రూ.15 వేలు తల్లికి వందనం ఇస్తామని చెప్పింది. ఈ లెక్కన జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులు సుమారు 4.70 లక్షల మంది ఉన్నారు. వీరిలో ప్రభుత్వం విధించే అర్హతల ప్రకారం తగ్గించినా.. దాదాపు 4 లక్షల మంది పిల్లల తల్లులకు సుమారుగా రూ.610 కోట్లపైగా జమ చేయాల్సి ఉంది. గతేడాదికి ఎగనామం పెట్టిన ప్రభుత్వం ఈ ఏడాదైనా ఇస్తుందా? లేదా? అనేది సందిగ్ధంగానే ఉంది. జూన్లో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు ఆ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంత వరకు విడుదలే చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతూ అర్హులైన ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు అందజేసింది. ఆ ప్రభుత్వం నాలుగేళ్లు నిర్విఘ్నంగా ఈ పథకాన్ని అమలు చేసింది.