
బడిబాట ర్యాలీలు
జిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండలంలోని కొడకంచి, నల్తూర్ తదితర గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య వసతులను వివరించారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశాలు కల్పించారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఆదివారం సెలవు దినమైన బడిబాట కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మొగిలిమాల, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వెంకటేశం, అంగన్వాడీ టీచర్లు సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎంపీ నిధులతో
బోర్ల తవ్వకాలు
నారాయణఖేడ్: తాగునీటి సమస్య పరిష్కారానికి పలు గ్రామాలు, తండాలకు బోర్ల తవ్వకం కోసం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ తనకోటా నిధుల ద్వారా ఒక్కోచోట బోరు తవ్వకం, మోటారు బిగించడం, పైపులైను ఏర్పాటు పనులకోసం రూ.3 లక్షల చొప్పున కేటాయించారు. ఆదివారం ఖేడ్ మండలం స్కూల్ తండా, హన్మాన్ తండాలతోపాటు మనూరు మండలం రాణాపూర్ గ్రామంలో బోర్ల తవ్వకాలను ఆయా తండాల పెద్దలు, గ్రామస్తులు పూజలు నిర్వహించి ప్రారంభించారు. నీటి ఎద్దడి నివారణకోసం ఎంపీ నిధులు కేటాయించడం పట్ల ఆయా తండాల వాసులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో ఎంపీ, ఎమ్మెల్యే
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణ శివారులోని మనూరు క్రాస్రోడ్డు సమీపంలో నూతనంగా నిర్మించిన లలితాంబిక దేవి ఆలయంలో నిర్వహిస్తున్న లలితాంబిక దేవి సహిత శివనంది, గణపతి, సుబ్రహ్మణ్య, శ్రీచక్ర, నాగదేవత, నంది, ధ్వజ, శిఖర విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవాలు, త్రయహ్నిక యాగమహోత్సవాలు మూడవరోజైన ఆదివారం కొనసాగాయి. జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, యువజనకాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్, మాజీ జెడ్పీటీసీ జితేందర్నాథ్ షెట్కార్ పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు.
వేల కోట్ల అవినీతిలో
బీజేపీ, బీఆర్ఎస్ పాత్ర
ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి
పటాన్చెరు టౌన్: కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడం ప్రాజెక్టు ఖర్చు రూ.60 వేల కోట్ల నుంచి రూ.90 వేల కోట్లకు పెంచడం రూ.30 వేల కోట్ల అవినీతిలో బీజేపీ,బీఆర్ఎస్ పాత్ర ఉన్నట్లు కనిపిస్తుందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆరోపించారు. పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆదివారం పటాన్చెరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రాజెక్టులపై మాజీమంత్రి హరీశ్రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం హంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 35 పథకాలతో రాష్ట్రంలోని సంబండ వర్గాల ప్రజల కార్మిక కర్షక అభివృద్ధిలో దూసుకుపోతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో సంజీవరెడ్డి, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు యువరాజ్, రతన్సింగ్, అంజయ్య, మల్లేశ్, రవి, ప్రకాశ్, ఆశిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

బడిబాట ర్యాలీలు

బడిబాట ర్యాలీలు

బడిబాట ర్యాలీలు

బడిబాట ర్యాలీలు