ముదిరాజ్‌ల సంక్షేమానికి సహకారం | - | Sakshi
Sakshi News home page

ముదిరాజ్‌ల సంక్షేమానికి సహకారం

Jun 9 2025 8:08 AM | Updated on Jun 9 2025 8:08 AM

ముదిరాజ్‌ల సంక్షేమానికి సహకారం

ముదిరాజ్‌ల సంక్షేమానికి సహకారం

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

అమీన్‌పూర్‌లో ముదిరాజ్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన

పటాన్‌చెరు: నియోజకవర్గ పరిధిలోని ముదిరాజ్‌ల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతికి సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని నవ్య రోడ్డులో నూతనంగా నిర్మించనున్న ముదిరాజ్‌ భవనం పనులకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...సేవా దృక్పథం, ధైర్యానికి మారుపేరైన ముదిరాజ్‌లు తెలంగాణ సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో సొంత నిధులతో ముదిరాజ్‌ల కోసం సంక్షేమ సంఘం భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. పటాన్‌చెరులోని ముదిరాజ్‌ భవన్‌ను రూ.రెండు కోట్ల రూపాయల సొంత నిధులతో ఆధునీకరించినట్లు గుర్తు చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంలో ముదిరాజ్‌లు అందించిన సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ నరసింహగౌడ్‌, మాజీ కౌన్సిలర్లు చంద్రకళ గోపాల్‌, కొల్లూరి మల్లేశ్‌, బాలరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గోపీనాథ్‌ మృతికి సంతాపం

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే,సీనియర్‌ నాయకులు మాగంటి గోపీనాథ్‌ అకాల మరణం పట్ల ఎమ్మెల్యే గూడెం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వరుసగా మూడుసార్లు శాసన సభకు ఎన్నికై ..ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సాధించుకున్న గోపీనాథ్‌ మరణం రాష్ట్ర ప్రజలకు తీరని లోటని అన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. గోపీనాథ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement