
చేప ప్రసాదానికి పోటెత్తిన జనం
నారాయణఖేడ్: ఉబ్బసం, దగ్గు, దమ్ము వ్యాధిగ్రస్తులకు మృగశిర కార్తెను పురస్కరించుకుని నిజాంపేట్ మండల కేంద్రంలో ఆదివారం పంపిణీ చేసిన చేప ప్రసాదానికి జనాలు బారులు తీరారు. రాష్ట్రంలోని వివిధప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలనుంచి వేలాదిమంది తరలివచ్చారు. ఏటా గ్రామంలోని తమ ఇంటివద్ద పంపిణీ చేస్తూ వస్తుండగా ప్రసాదం కోసం వస్తున్న వేలాది మందికి స్థలం చాలక పోతుండటంతో ఈసారి గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కనే టెంట్లు వేసి పంపిణీ చేపట్టారు.
తడ్కంటి సోదరులు తడ్కంటి పర్వాగౌడ్, లింగాగౌడ్, నాగరాజు, శంకర్గౌడ్, వెంకటేశ్గౌడ్, సాయిబాబా గౌడ్లు వ్యాధిగ్రస్తులతో చేపప్రసాదాన్ని మింగించారు. దూర ప్రాంతాల నుంచి కొంతమంది ప్రసాదం కోసం శనివారం సాయంత్రం నిజాంపేటకు చేరుకోగా వారికి నిర్వాహకులు బస ఏర్పాట్లు చేశారు.
ఉబ్బసం, దగ్గు, దమ్ము వ్యాధిగ్రస్తులకు పంపిణీ