ఆమనగల్లు: సీఎం రేవంత్రెడ్డిని ఆదివారం ఆమనగల్లు పట్టణానికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకులు, రేవంత్ మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సన్మా నించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆమనగల్లులో జూనియర్ కళాశాల భవన నిర్మాణ సమస్యలను పరిష్కరించాలని సీఎంను అభ్యర్థించినట్లు అప్పం శ్రీను తెలిపారు.
ఎంపీ రంజిత్రెడ్డిని కలిసిన నాయకులు
మొయినాబాద్: కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డిని ఆ పార్టీ వికలాంగుల విభాగం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం నగరంలోని ఆయన నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు మద్యపాగ సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింహ్మచారి, జ్ఞానేశ్వర్, పరమేశ్గౌడ్ తదితరులు ఎంపీ రంజిత్రెడ్డిని కలిసి శాలువాతో సన్మానం చేశారు. ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.