భూభారతి చట్టం.. రైతులకు చుట్టం | - | Sakshi
Sakshi News home page

భూభారతి చట్టం.. రైతులకు చుట్టం

Apr 30 2025 12:44 AM | Updated on Apr 30 2025 12:44 AM

భూభారతి చట్టం.. రైతులకు చుట్టం

భూభారతి చట్టం.. రైతులకు చుట్టం

కోనరావుపేట(వేములవాడ): ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న భూభారతి చట్టం రైతులకు చుట్టం లాంటిదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం మండలంలోని నిజామాబాద్‌ రైతువేదికలో అవగాహన సదస్సులో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మొదటిసారిగా ఇందిరమ్మ ఇళ్లను, నిరుపేదలకు భూముల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో వేల ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిందన్నారు.

తూకం వేసిన ధాన్యాన్ని తరలించాలి

కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని త్వరగా తరలించాలని అధికారులకు విప్‌ సూచించారు. నిజామాబాద్‌లోని కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాతో కలిసి పరిశీలించారు. మర్తనపేట, గొల్లపల్లి గ్రామాల్లో బోర్లను పరిశీలించారు. మర్తనపేటకు 2, గొల్లపల్లికి 1, మరిమడ్లకు ఒకటి నూతన మోటార్లను కలెక్టర్‌ మంజూరు చేశారు. మర్తనపేటలో నిర్మితమవుతున్న ఇందిరమ్మ ఇళ్లను, పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్య, తహసీల్దార్‌ వరలక్ష్మి, కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement