ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

Jun 7 2025 12:06 AM | Updated on Jun 7 2025 12:06 AM

ఇందిర

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

● జెడ్పీ సీఈవో గీత

కోనరావుపేట(వేములవాడ): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని జెడ్పీ సీఈవో గీత కోరారు. కోనరావుపేట మండల పరిషత్‌లో కార్యదర్శులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో శుక్రవారం సమావేశమయ్యారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఇంకా ముగ్గులు పోసే దశలోనే ఉంటున్నాయని, వెంటనే పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవో శంకర్‌రెడ్డి, లేబర్‌ ఆఫీసర్‌ రఫీక్‌, ఎంపీవో ఆరిఫ్‌పాషా, ఏఈ సాయిప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

యారన్‌ సబ్సిడీ అందించాలి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): టెక్స్‌టైల్‌ పార్క్‌లో పనిచేసే పవర్‌లూమ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న యారన్‌ సబ్సిడీని వెంటనే అందించాలని సీఐటీయూ పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. టెక్స్‌టైల్‌ పార్క్‌లో చేనేత జౌళిశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎన్వీ రావుకు వినతిపత్రం అందజేశారు. రమణ మాట్లాడుతూ కార్మికులకు నిరంతరం ఉపాధితోపాటు మెరుగైన వేతనాలు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. టెక్స్‌టైల్‌ పార్కు వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు కూచన శంకర్‌, మా మిడాల శ్రీనివాస్‌, రాచర్ల వేణు, పులి రమేశ్‌, కందికట్ల శ్రీనివాస్‌, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

9న ఐటీఐలో అప్రెంటీస్‌ మేళా

సిరిసిల్లకల్చరల్‌: సిరిసిల్ల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లో ఈనెల 9న జాతీయస్థాయి అప్రెంటీస్‌ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ కవిత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 2024 నాటికి ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, మెకానిక్‌ డీజిల్‌, మెకానిక్‌ మో టార్‌ వెహికల్‌, వెల్డర్‌ ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లని కోరారు. ఎస్సెస్సీ మెమో, ఐటీఐ మెమో, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణపత్రాలతో హాజ రుకావాలని తెలిపారు. వివరాలకు 86886 12668లో సంప్రదించాలని సూచించారు.

మధ్యాహ్న కార్మికుల బిల్లులు చెల్లించాలి

సిరిసిల్లటౌన్‌: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేసి మాట్లాడారు. కార్మికులకు ఆరు నెలల మెస్‌చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు, గౌరవ వేతనం పెండింగ్‌లో ఉందన్నారు. వెంటనే విడుదల చేయాలని కోరారు. నాయకులు గురిజాల శ్రీధర్‌, కార్మికులు వసంత, సత్తవ్వ, పద్మ, ఎల్లవ్వ, భాగ్య పాల్గొన్నారు.

ఏరియా ఆస్పత్రిలో కాయకల్ప బృందం

వేములవాడఅర్బన్‌: వేములవాడ ఏరియా ఆస్పత్రిని కాయకల్ప బృందం అధికారులు శుక్రవారం సందర్శించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవీందర్‌ మాట్లాడుతూ ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలు, నిర్వహణపై కాయకల్ప టీమ్‌ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. గతంలోనూ ఈ ఆస్పత్రికి మూడుసార్లు కాయకల్ప అవార్డుతోపాటు ఎన్‌క్వాస్‌లో మొదటిస్థానం, లక్ష్యలో మొదటి స్థానం నిలిచిందని వివరించారు. ఈ ఏడాది సైతం ఆస్పత్రి మొదటిస్థానంలో నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యులు సతీశ్‌, అస్సెసర్‌ స్టెల్లా, పెరుక తిరుపతి, నిషాత్‌ సల్మా, సుభాషిణి, సంతోష్‌చారి ఉన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
1
1/3

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
2
2/3

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
3
3/3

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement