
తాగి వాహనాలు నడపొద్దు
● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్లక్రైం: మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరా రు. జిల్లాలో పది రోజుల వ్యవధిలో 77 మందిపై డ్రంకెన్డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో 46 మందికి జరిమానాలు, 31 మందికి జైలుశిక్ష ఖరారు చేసినట్లు వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయన్నారు. దీంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనాలకు బీమా చేయించుకోవాలన్నారు.