పిల్లలు బడిలో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లలు బడిలో ఉండాలి

Jun 7 2025 12:06 AM | Updated on Jun 7 2025 12:06 AM

పిల్లలు బడిలో ఉండాలి

పిల్లలు బడిలో ఉండాలి

సిరిసిల్ల: జిల్లాలో ప్రతీ పిల్లవాడు బడిలో చేరేలా చూడాలని, బాలకార్మికులు లేని జిల్లాగా మార్చాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కోరారు. కలెక్టరేట్‌లో శుక్రవారం బడిబాటపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బడిబాటలో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఏఎన్‌ఎంలు, వీవోఏలు కలిసి బృందంగా ఏర్పడి ప్రతీ ఇంటిని సందర్శించి, పిల్లలంతా పాఠశాలల్లో నమోదయ్యేలా చూడాలన్నారు. విద్యాబోధన, వసతులు, ఉచిత పుస్తకాలు, యూని ఫామ్‌, మధ్యాహ్న భోజనం వివిధ పోటీపరీక్షలు జేఈఈ, నీట్‌ ఎంట్రన్స్‌ పరీక్ష కోచింగ్‌, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌, విశాలమైన ప్లే గ్రౌండ్‌ గురించి తల్లి దండ్రులకు వివరించాలని సూచించారు. డ్రాపౌ ట్‌ కాకుండా చూడాలన్నారు. గ్రామాల్లో పంచా యతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాలకార్మికులు లేకుండా చూడాలన్నారు. డీఆర్‌డీవో శేషాద్రి, జి ల్లా వైద్యాధికారి రజిత తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించాలి

ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపత్రాలు పొందిన వారు వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలని కలెక్టర్‌ కోరారు. ఎంపీడీవోలు, హౌసింగ్‌ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,413 ఇండ్లు గ్రౌండింగ్‌కాగా, మిగతా ఇళ్ల పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఉత్తమ పనితీరు చూపుతున్న పంచాయతీ కార్యదర్శులను అభినందించారు. గ్రామాలవారీగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో వాట్సాప్‌ గ్రూపులు పెట్టాలని తెలిపారు.

కంపోస్టుషెడ్లు వినియోగించాలి

సెగ్రిగేషన్‌ షెడ్లు, కంపోస్టుషెడ్లు వినియోగించాలని డీఆర్డీవో శేషాద్రి సూచించారు. వర్మీ కంపోస్ట్‌ తయారీపై వివరాలు ఇవ్వాలన్నారు. వ్యక్తిగత, సామూహిక ఇంకుడుగుంతలు వినియోగంలోకి వచ్చేలా పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలని తెలిపారు. హౌసింగ్‌ పీడీ శంకర్‌, డీపీవో షరీఫొద్దీన్‌, డీఎల్పీవో నరేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలి

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించాలి

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement