ఉపాధిహామీ పనులకు రండి | Sakshi
Sakshi News home page

ఉపాధిహామీ పనులకు రండి

Published Tue, May 7 2024 1:10 AM

ఉపాధిహామీ పనులకు రండి

● మాన్వాడలో కూలీలకు బొట్టు పెట్టి ఆహ్వానం

బోయినపల్లి(చొప్పదండి): ఉపాధిహామీ పనులపై కూలీలకు అవగాహన కల్పించేందకు మండలంలోని మాన్వాడలో అధికారులు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఏపీడీ నర్సింహులు ఆధ్వర్యంలో అధికారులు సోమవారం గ్రామంలో ఉపాధిహా మీ పనులకు రావాలని కోరుతూ ఇంటింటికి వెళ్లి కూలీలకు బొట్టు పెట్టి పిలిచారు. గ్రామంలో ఉపాధిహామీ పనులకు వచ్చే కూలీల హాజరు పడిపోవడంతో కూలీల సంఖ్య పెంచేందుకు అధికారులు వినూత్నంగా ప్రచారం చేశారు. డప్పుచప్పుళ్లతో ఉపాధిహామీ పనులపై గ్రామంలో అవగాహన కల్పించారు. ఈజీఎస్‌ ఏపీవో వనం సబిత, పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement