నేటి నుంచి రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు

May 31 2025 1:28 AM | Updated on May 31 2025 4:59 PM

తర్లుపాడు: తర్లుపాడులోని నీలంపాటి లక్ష్మీ అమ్మవారి పంచమదశ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నుంచి రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సీనియర్‌ విభాగంలో విజేతలకు ప్రథమ బహుమతి రూ.60 వేలు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, తృతీయ బహుమతి రూ.40 వేలు, చతుర్థ బహుమతి రూ.30 వేలతోపాటు 8 జతల ఎడ్ల యజమానులకు కన్సోలేషన్‌ బహుమతులు అందించనున్నట్లు వివరించారు. వివరాలకు 9440791698, 9640408773ను సంప్రదించాలని సూచించారు.

విద్యుత్‌ తీగలు తెగి 4 దూడలు మృతి

అర్ధవీడు: రోడ్డుపై 11 కేవీ విద్యుత్‌ తీగలు తెగిపడటంతో నాలుగు దూడలు చనిపోయిన సంఘటన శుక్రవారం అర్ధవీడులోని ఈద్గా సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు విద్యుత్‌ తీగలు తెగిపడటంతో మామిళ్ల మల్లికార్జునరెడ్డికి చెందిన 4 దూడలు చనిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న విద్యుత్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తీగలను సరిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement