
మాజీ సీఎం ఎన్టీఆర్కు నివాళి
ఒంగోలు సబర్బన్: మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా బుధవారం ఒంగోలు అద్దంకి బస్టాండ్లోని ఆయన విగ్రహానికి కలెక్టర్ తమీమ్ అన్సారియా నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డీఆర్ఓ చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు, మెప్మా పీడీ శ్రీహరి, స్టెప్ సీఈఓ శ్రీమన్నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్టీఆర్ చిత్రపటాలకు నివాళులర్పించారు.