
సిమ్స్లో వసతులపై ఆరా
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ(సిమ్స్)తోపాటు జీజీహెచ్ టీచింగ్ ఆస్పత్రిని నేషనల్ మెడికల్ కౌన్సిల్ నియమించిన రాష్ట్ర కమిటీ సోమవారం సందర్శించింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(అకడమిక్) శివరాంప్రసాద్, టీఎస్ఎండీసీ ఈఈ విశ్వప్రసాద్ తదితరులు మెడికోల హాస్టల్, టీచింగ్ ఆస్పత్రిలో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ కోయ శ్రీహర్షతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ, మెడికల్ కాలేజీతోపాటు జీజీహెచ్ టీచింగ్ ఆస్పత్రిలో మౌలిక వసతుల కల్పన, ఫ్యాకల్టీ వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తయారు చేయడానికి ప్రత్యేక కమిటీని రూపొందించిందన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ దయాల్సింగ్, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ నరేందర్, ఆర్ఎంవో రాజు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.