విజయనగరం క్రైమ్: ఉమ్మడి విజయనగరం జిల్లా లో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన 535 మంది మహిళా సంరక్షణ పోలీసుల(ఎంఎస్పీ)కు స్థానచలనం కలి గినట్టు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీ స్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో సోమవా రం రాత్రి 10 గంటల వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ సాగింది. ఎస్పీతో పాటు ఏఎస్పీ సౌమ్యలత కౌన్సె లింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. రోగులైన వారు, వైవాహిక పరిస్థితులు, విజువల్ ఇంప్లైయిడ్, తదిత ర అంశాలపై బదిలీల్లో పరిగణనలోకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.
మొత్తం 635 మందికి 535 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి వార్డు/గ్రామ సచి వాలయాలను కేటాయించామన్నారు. కలెక్టర్ ఉత్తర్వులు మేరకు బదిలీ ఉత్తర్వులను రెండు, మూడు రోజు ల్లో విడుదల చేస్తామ ని తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ ఏఓ శ్రీనివాసరావు, ఎస్బీ సీఐలు లీలారావు, చౌ దరి, సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, ఎస్ఐ ప్రభావతి, ఆర్ఎస్ఐ లు నీలిమ,మంగలక్ష్మి, డీపీఓ సిబ్బంది తేజ, రాంబాబు, శ్రీనివాసరావు, సుధారాణి, హేమంత్, పీఆర్వో కోటేశ్వరరా వు, ఐటీ కోర్ టీమ్ పాల్గొన్నారు.

535 ఎంఎస్పీలకు స్థానచలనం