అపూర్వ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

అపూర్వ సమ్మేళనం

Jun 9 2025 7:44 AM | Updated on Jun 9 2025 7:44 AM

అపూర్

అపూర్వ సమ్మేళనం

అంగరంగా వైభవంగా వజ్రోత్సవం

విదేశాల నుంచి తరలివచ్చిన

పూర్వ విద్యార్థులు

పూర్వ విద్యార్థులతో కిటకిటలాడిన వీరఘట్టం హైస్కూల్‌ ప్రాంగణం

గతంలో పనిచేసిన

ఉపాధ్యాయులకు సత్కారం

వానికి హాజరైన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ను పూర్వ విద్యార్థులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకు చదువు చెప్పిన మాస్టార్లను గౌరవించడం విద్యార్థుల బాధ్యత అన్నారు.

పాఠశాల అభివృద్ధికి విరాళాలు..

వీరఘట్టం హైస్కూల్‌లో 1970లో చదువుకున్న దౌలూరు కై లాసరావు పాఠశాల అభివృద్ధికి రూ.1 లక్ష చెక్కును ఉత్సవ కమిటీకి అందజేశారు. అలాగే మరి కొంతమంది పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి విరాళాలు ప్రకటించారు. అలాగే వజ్రోత్సవం విజయవంతం చేయడంలో కృషి చేసిన 1982 బ్యాచ్‌కు చెందిన బెహరా ప్రసాద్‌, ఇట్లా మన్మథరావు, కోణార్క్‌ శ్రీనులను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.

పాఠశాల అభివృద్ధికి దోహదం

పాఠశాలల్లో పూర్వ విద్యార్థులు నిర్వహించే ఆత్మీయ కలయికలు పాఠశాలల అభివృద్ధికి దోహదపడతాయని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి కె.రాజ్‌కుమార్‌ అన్నారు.ఆత్మీయ కలయికకు ఇంతమంది పూర్వ విద్యార్థులు హాజరుకావడంతో పాఠశాల చరిత్రలో ఓ సంచలనమని డీఈఓ అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన విశ్రాంత ఉపాధ్యాయులు వాన సత్యంనాయుడు, సీరపాణి, బీవీ సత్యానందం, కె.సత్యమూర్తి, నిష్టల నరసింహమూర్తి, కె.శేషమ్మ, పెంకి సుందరరావు, మాచర్ల శ్రీరాములుదొర, ఎంబీ బెనర్జీ, పొట్నూరు భరతుడు, ధర్మాన సిమ్మయ్య, అడివినాయుడు, జీఎస్‌ఎన్‌, వారాడ వేణుగోపాలరావు, యర్రా అప్పలరాజు, తెంటు రామినాయుడు తదితరులను ఉత్సవ కమిటీతో పాటు డీఈఓ ఘనంగా సత్కరించారు.

వీరఘట్టం: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఏర్పాటై 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 2 వేల మంది పూర్వ విద్యార్థులు ఈ సంబరానికి హాజరు కావడంతో సభా ప్రాంగణం కిటకిటలాడింది. వీరఘట్టంలోని పంచముఖ ఆంజేయస్వామి ఆలయ సెంటర్‌ నుంచి పూర్వ విద్యార్థులు ర్యాలీ చేపట్టి ప్రధాన రహదారి గుండా హైస్కూల్‌కు చేరుకున్నారు. ఉత్సవ కమిటీ అంచనాలకు మించి పూర్వ విద్యార్థులు రావడంతో హైస్కూల్‌ ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. తొలుత హైస్కూల్‌కు ఐదెకరాల స్థలాన్ని ఇచ్చిన స్థలదాత దివంగత రౌతు చిన్నంనాయుడు విగ్రహాన్ని ఆయన మనుమడు హైకోర్టు న్యాయవాది రౌతు సురేష్‌కుమార్‌, ఆయన కుటుంబసభ్యులు ప్రతిష్టించారు. తర్వాత శ్రీకాకుళం గురజాడ సంస్థల అధినేత గుండ్రెడ్డి స్వామినాయుడు ప్రపంచ మల్లయోధుడు కోడి రామ్మూర్తినాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఈ వజ్రోత్సవానికి హాజరైన మాజీ గురువులకు ఉత్సవ కమిటీ సభ్యులు మంగళవాఽయిద్యాలు, పూర్ణ కలశాలతో సాదర స్వాగతం పలికారు. సభా వేదికపై ఆసీనులైన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించి, వజ్రోత్సవ జ్ఞాపికలను అందజేశారు.

ఇది గొప్ప కార్యక్రమం

వజ్రోత్సవానికి హాజరైన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 52 బ్యాచ్‌లను సమన్వయం చేస్తూ ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన కమిటీ సభ్యులను అభినందించారు.

చదువు చెప్పిన మాస్టారును గౌరవించాలి

వీరఘట్టం హైస్కూల్‌లో జరుగుతున్న వజ్రోత్స

అపూర్వ సమ్మేళనం1
1/3

అపూర్వ సమ్మేళనం

అపూర్వ సమ్మేళనం2
2/3

అపూర్వ సమ్మేళనం

అపూర్వ సమ్మేళనం3
3/3

అపూర్వ సమ్మేళనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement