
శాసీ్త్రయ ధృక్పథం పెంపొందించడమే లక్ష్యం
బొబ్బిలి: ప్రజల్లో శాసీ్త్రయ ధృక్పథాన్ని పెంపొందించి, విజ్ఙాన శాస్త్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా జనవిజ్ఙాన వేదిక పనిచేస్తోందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రాజగోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో జేవీవీ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జేవీవీ రాష్ట్ర మహాసభలను సెప్టెంబర్లో విజయనగరంలో నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా విజ్ఙాన మేళాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్థిక వనరుల సమీకరణ అంశాలపై సభ్యులతో చర్చించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ ప్రభాత్, ఉపాధ్యక్షుడు సత్యం నాయుడు,శివానంద్ పాల్గొన్నారు.