
అభివృద్ధికి దూరం..!
తాగునీటి సమస్యకు
పరిష్కారం లేదా...
పట్టణంలోని తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే బురద నీరు.. వేసవి కాలం వస్తే నాలుగు రోజులకొకసారి తాగునీటి సరఫరా చేయడంతో పట్టణ వాసులు దాహంతో అల్లాడుతున్నారు. కొన్ని వార్డుల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో మూడు రోజులకొకసారి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు గత ప్రభుత్వం రూ.65కోట్లతో సమగ్ర తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. వాటిని పునఃప్రారంభించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని పట్టణ వాసులు కోరుతున్నారు.