
జనావాసాల నడుమ కూలిన విద్యుత్ స్తంభాలు
సంతకవిటి మండలంలోని కృష్ణంవలస గ్రామంలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇటుకలతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి దిగువ వీధిలోని మట్ట దుర్గారావు ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ తాకిడికి అదే వీధిలోని మరో రెండు విద్యుత్ స్తంభాలు ఉన్న ఫలంగా విరిగి కింది పడ్డాయి. వీటితో పాటు మరో స్తంభం వాలిపోయింది. విద్యుత్ వైర్లు ఇళ్లను తాకుతూ వీధుల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ట్రిప్ అయ్యి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామస్తులు అప్రమత్తమై ట్రాన్స్ఫార్మర్ నుంచి సరఫరాను నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ పరిణామంతో వీధుల్లోని ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న విదు్య్త్ శాఖాధికారులు గ్రామాన్ని సందర్శించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. – సంతకవిటి

జనావాసాల నడుమ కూలిన విద్యుత్ స్తంభాలు