రైల్వేస్టేషన్‌లో మతి స్థిమితం లేని వ్యక్తి హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లో మతి స్థిమితం లేని వ్యక్తి హల్‌చల్‌

May 25 2025 8:12 AM | Updated on May 25 2025 8:12 AM

రైల్వ

రైల్వేస్టేషన్‌లో మతి స్థిమితం లేని వ్యక్తి హల్‌చల్‌

చాకచక్యంగా పట్టుకున్న రైల్వే, ఫైర్‌ సిబ్బంది

కొత్తవలస : మతి స్థిమితం లేని గుర్తు తెలియని వ్యక్తి కొత్తవలస రైల్వేస్టేషన్‌లో శనివారం విద్యుత్‌ వైర్లు పట్టుకొని చనిపోతానని హల్‌చల్‌ చేశాడు. సుమారు రెండు గంటలు శ్రమించి రైల్వే సిబ్బంది, ఫైర్‌ పోలీస్‌లు ఆయనను చాకచక్యంగా పట్టుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కొత్తవలస రైల్వేస్టేషన్‌ సమీపంలో గుర్తు తెలియని మతి స్థిమితం లేని ఒక యువకుడు స్థానికులపై రాళ్లు రువ్వి బెదిరించాడు. సమీపంలో గల రైల్వేస్టేషన్‌లోకి వెళ్లి విద్యుత్‌ లైన్‌ల సమీపంలో గల రేకుల షెడ్‌పైకి ఎక్కి వైర్లు దగ్గరకు వెళ్లాడు. ప్రమాదం దిగిపో.. అంటూ స్థానికులు, రైల్వే సిబ్బంది సూచించినా కనీసం పట్టించుకోలేదు. ఎవరైనా దగ్గరకు వస్లే వైర్లు పట్టుకొని చనిపోతానని బెదిరించాడు. రైల్వే అధికారులు అప్రమత్తమై విశాఖపట్నం ప్రధాన రైల్వేస్టేషన్‌కు పోన్‌ చేసి ప్రధాన లైన్‌కు సంబంధించి విద్యుత్‌ సరఫరాను నిలిపి వేయించారు. ఘటనా స్థలానికి ఫైర్‌ సిబ్బంది చేరుకొని రైల్వే సిబ్బందితో కలిసి ఆ యువకుడిని తాళ్లతో బంధించి కిందకు దించారు. అనంతరం విశాఖపట్నం తరలించారు.

వడదెబ్బకు రైతు మృతి

వీరఘట్టం: మండలంలోని విక్రమపురం గ్రామానికి చెందిన శ్రీరాములదొర(74) అనే రైతు వడదెబ్బకు శనివారం గురై మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం వీరఘట్టం మార్కెట్‌కు సామగ్రి తేవడానికి వెళ్లి మధ్యాహ్న 12.30 గంటలకు శ్రీరాములదొర ఇంటికి వచ్చాడు. ఇంట్లో మంచంపై కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

రైల్వేస్టేషన్‌లో మతి స్థిమితం లేని వ్యక్తి హల్‌చల్‌1
1/1

రైల్వేస్టేషన్‌లో మతి స్థిమితం లేని వ్యక్తి హల్‌చల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement