మహేంద్రగిరిపై అఖిల భారత సాధువుల సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

మహేంద్రగిరిపై అఖిల భారత సాధువుల సమ్మేళనం

Jun 17 2024 1:56 AM | Updated on Jun 17 2024 1:56 AM

మహేంద్రగిరిపై అఖిల భారత సాధువుల సమ్మేళనం

మహేంద్రగిరిపై అఖిల భారత సాధువుల సమ్మేళనం

పర్లాకిమిడి: మహేంద్రగిరి పర్వతంపై వెలసివున్న కుంతీ మందిరం వద్ద ఆదివారం అఖిల భారతీయ సాధు సంతవుల సమ్మేళనం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సాధువులంతా ఇక్కడికి చేరుకున్నారు. గజపతి జిల్లా రాయగడ బ్లాక్‌లో ఉన్న పవిత్ర మహేంద్రగిరిని పర్యాటక కేంద్రంగా పరిరక్షించాలని, పురాతన మందిరాలు కాపాడాలని ఒడిశా సీఎం మోహాన్‌ మఝి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులకు వినతిపత్రాలు అందజేయాలని దేవిమఠం మహాంత రామానంద్‌ దాస్‌, ఓంకార్‌ నందో, సాధ్వి అనితాదేవి తీర్మానించారు. సమావేశంలో మహేంద్రగిరి పరిరక్షణ కమిటీ అధ్యక్షులు భాస్కరతీర్ధ స్వామి లక్ష్మీబాబా, బాలముకుంద కేంద్రం నిర్వాహకులు నిత్యానంద చౌదురి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement