దుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద వితరణకు విరాళాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద వితరణకు విరాళాలు

Dec 4 2025 7:44 AM | Updated on Dec 4 2025 7:44 AM

దుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద వితరణకు విరాళాలు

దుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద వితరణకు విరాళాలు

దుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద వితరణకు విరాళాలు

భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గ అమ్మవారి సన్నిధిలో నిత్యం నిర్వహించే అన్నప్రసాద వితరణకు దాతలు బుధవారం విరాళాలను అందజేశారు. విజయవాడ భారతీనగర్‌కు చెందిన కె.సతీష్‌ కుమార్‌ కుటుంబ సభ్యులుతో కలిసి శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి వచ్చి ఆలయ కార్యనిర్వహణాధికారిని కలిసి రూ.1,00,116 విరాళాన్ని అందజేశారు. మధురానగర్‌కు చెందిన కనపర్తి వెంకట రవిరాజా కుటుంబ సభ్యులు కనపర్తి వెంకటేశ్వరరావు, శివకుమారి తమ పేరుతో అన్నప్రసాద వితరణకు రూ.1,00,116 విరాళం సమర్పించారు. ఈ సందర్భంగా దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వారికి వేదాశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement